దోమకొండ/విద్యానగర్, డిసెంబర్ 20 : కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో వైద్యం అందిస్తున్నట్లు విప్ గంపగోవర్ధన్ తెలిపారు. మంగళవారం దోమకొండ మండల కేంద్రంలోని సీహెచ్సీలో స్కానింగ్ గదిని, అల్ట్రా స్కానింగ్ యంత్రాన్ని ప్రారంభించారు. బాలింతలకు కేసీఆర్ కిట్ను అందజేశారు. రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని అన్నారు. ప్రైవేటులో స్కానింగ్ కోసం పేదలు వేలాది రూపాయలు ఖర్చు చేసి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని వారి కష్టాలను తీర్చడానికే వైద్య సేవలు, పరికరాలు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. జిల్లాలోనే సీహెచ్సీలో అల్ట్రాసౌండ్ యంత్రం దోమకొండలోనే ఉందని గుర్తుచేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్నరాజేశ్వర్, ఎంపీపీ శారద, జడ్పీటీసీ తిర్మల్గౌడ్, సర్పంచ్ నల్లపు అంజలి, ఉపసర్పంచ్ గజవాడ శ్రీకాంత్, జిల్లా దవాఖాన పర్యవేక్షకురాలు విజయలక్ష్మి, సూపరింటెండెంట్ సంగీత్కుమార్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గండ్రమధుసూదన్రావు, సింగిల్విండో చైర్మన్ నాగరాజురెడ్డి, మార్కెట్కమిటీ మాజీ చైర్మన్ కుంచాల శేఖర్, ఐరేని నర్సయ్య, ఆయా గ్రామాల ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
కామారెడ్డి నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన 199 మందికి రూ. కోటీ 99 లక్షల 23 వేల 084 కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆడపిల్లల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి అనేక పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. ఆడపిల్ల పుడితే బాధపడే రోజులు పోయాయన్నారు.