ఖలీల్ వాడి, మార్చి 23 : నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో రెండురోజులపాటు నిర్వహించిన ప్రాపర్టీ షో శనివారం ముగిసింది. జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. నిజామాబాద్, హైదరాబాద్కు చెందిన ప్రముఖ డెవలపర్స్, రియల్ ఎస్టేట్ కంపెనీలతోపాటు బ్యాంకులు ఒకే వేదికపైకి తరలిరాగా..23 స్టాళ్లను ఏర్పాటు చేశారు. శుక్ర, శనివారాలు స్టాళ్ల వద్ద సందర్శకులతో సందడి నెలకొంది. ప్రాపర్టీ షోలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రజలు నిశితంగా పరిశీలించారు. హైదరాబాద్, నిజామాబాద్ ప్రాంతాలకు చెందిన ప్రాపర్టీలు, చదరపు అడుగుకు ఉన్న ధరలతోపాటు రుణ సదుపాయం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.
నిజామాబాద్ – హైదరాబాద్ మార్గంలో చేపడుతున్న పలు నిర్మాణ రంగ ప్రాజెక్టుల్లో మధ్య తరగతి వర్గాలకు అందుబాటులో ధరలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. స్టాళ్లలో ఇంటీరియల్ డెకరేషన్, ఇతరత్రా స్టాళ్లను ఆసక్తిగా పరిశీలించారు. నూతన ఇండ్ల నిర్మాణం, అపార్ట్మెంట్లకు సంబంధించిన వివరాలను ఆయా కంపెనీల ప్రతినిధులను అడిగి తెలుసుకొన్నారు. అందుబాటు ధరలో ఉన్న ఆస్తులను కొనుగోలుకు ఆసక్తి కనబర్చారు. రాష్ట్రంలో హైదరాబాద్ సహా అనేక పట్టణాలు, నగరాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు.
రియల్ రంగంలో అనేక కంపెనీలు చేపడుతున్న ప్రాజెక్టులు, ప్రముఖ నిర్మాణ రంగ కంపెనీలను ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చి, ఇంతటి అద్భుతమైన కార్యక్రమం చేపట్టిన ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ను సందర్శకులు అభినందించారు. నగర వాసులకు ఇలాంటి కార్యక్రమాలతో దూర, వ్యయభారం తప్పుతుందన్నారు. వినూత్న ఆలోచనలతో సరికొత్త కార్యక్రమాలను చేపడుతున్న ‘నమస్తే తెలంగాణ’ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని వారు ఆకాంక్షించారు. గతంలో ఆటో షో , ప్రాపర్టీ షో వంటి కార్యక్రమాలను ఇదే వేదికగా ఘనంగా నిర్వహించి, ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూర్చారని గుర్తుచేశారు. కార్యక్రమంలో నమస్తే తెలంగాణ బ్రాంచ్ మేనేజర్ గడ్డి ధర్మరాజు, బ్యూరో చీఫ్ జూపల్లి రమేశ్, ప్రకటనల విభాగం మేనేజర్ శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.
అన్నిరకాల సోలార్ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. టాటా సోలార్, పవర్ గ్రిడ్ సిస్టమ్, పీఎమ్ సూర్య ప్రాజెక్ట్ కింద సోలార్ సిస్టమ్ తదితర వాటిని అందుబాటులో ఉంచాం. సోలార్ సిస్టమ్కు సబ్సిడీ సదుపాయం కూడా ఉన్నది. అక్షయ ఎంటర్ప్రైజెస్ను తెలంగాణలోని ఆరు జిల్లా ల్లో ఏర్పాటు చేశాం. త్వరలోనే నిజామాబాద్లో ప్రారంభిస్తాం.
హైదరాబాద్లో 40 ప్రాజెక్ట్స్ అందుబాటులో ఉ న్నాయి. 2బీహెచ్కే, 3బీహెచ్కే ఫ్లాట్లు రూ.35 లక్షల నుంచి రూ.1.60 కోట్ల వరకు అందుబాటులో ఉన్నాయి. విశాలమైన పార్కులు, అపార్ట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి.
– ఎస్. సునీల్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, మోడీ ప్రాపర్టీస్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ బైపాస్కు దగ్గరలో గేటెడ్ కమ్యూనిటీ 114 డూ ప్లెక్స్ విల్లాస్ అందుబాటులో ఉన్నాయి. సిటీకి దగ్గరగా అన్ని వసతులతో జీప్లస్1 అనుమతితో సిద్ధంగా ఉన్నాయి.
– వైష్ణవి, ఎండీ, శ్రీ వేంకటేశ్వర కన్స్ట్రక్షన్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ బైపాస్కు సమీపంలో అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్న 2బీహెచ్కే,3బీహెచ్కే ఫ్లాట్లు తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. 2బీహెచ్కే రూ.40లక్షల నుంచి రూ.45 లక్షలు,3బీహెచ్కే రూ.50 లక్షల నుంచి రూ.55 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయి.
– సంతోష్రెడ్డి, ఎండీ, సంతోష్ డెవలపర్స్
ఎన్హెచ్ 44 పక్కన తూప్రాన్కు దగ్గరలో విశాలమైన వాతావరణంలో డీటీసీపీ, హెచ్డీఏ లేఅవుట్, రెరాకు సంబంధించిన అన్ని అనుమతులు ఉన్నాయి. కొనుగోలుకు ప్లాట్లు సిద్ధంగా ఉన్నాయి.
– దత్తా జాదవ్, మార్కెటింగ్ డైరెక్టర్, భూమిస్పేస్
మా దగ్గర అన్ని రకాల హోమ్ అప్లయెన్స్ అం దుబాటులో ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కలిగిన ఫర్నిచర్ అతి తక్కువ ధరల్లో లభిస్తున్నాయి. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉన్నాయి.
– రఘుధీర్రెడ్డి, ఎండీ, రాయల్ ఓక్
గృహ అవసరాలకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తక్కువ సమయంలోనే రుణాలు అం దిస్తున్నది. త క్కువ వడ్డీతో రుణాలు ఇస్తున్నాం. ప్రజ లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
– నీరజ్ కుమార్,అసిస్టెంట్ మేనేజర్, యూబీఐ బ్యాంక్
మేడ్చల్ దగ్గర గుండ్లపోచంపల్లిలో విల్లాస్, ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. సుమారు 8.26 ఎకరాల్లో 101 విల్లాలు నిర్మించాం. సామాన్యులకు అందుబాటు ధరలో, చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంతో రెడీగా ఉన్నాయి.
– రజనీకాంత్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, సన్యుగ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్
నిజామాబాద్లోని అశోకా బిల్డర్స్ 20 ఏండ్లుగా తక్కువ ధరలతో నాణ్యమైన అపార్ట్మెంట్లను ప్రజలకు అందిస్తున్నది. ప్రస్తుతం ఐదు ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయి. 2బీహెచ్కే, 3బీహెచ్కే ఫ్లాట్లు, ఇండిపెండెంట్ ఇండ్లు అందుబాటులో ఉన్నాయి.
– అశ్విన్రెడ్డి, మేనేజర్, శ్రీ అశోక బిల్డర్స్
హైవేకు దగ్గరగా సుచిత్ర సెంటర్లో గేటెడ్ కమ్యూనిటీ 2బీహెచ్కే, 3బీహెచ్కే ఫ్లాట్లు అందుబాటు ధరలతో రెడీగా ఉన్నాయి. రూ.80 లక్షల నుంచి రూ.1.5 కోట్ల వరకు ధర పలుకుతున్నాయి.
– షణ్ముఖ, సేల్స్ మేనేజర్, సీత షల్టర్స్
జహీరాబాద్లో ఉన్న అతిపెద్ద డెవలపర్స్ వల్లేరు డెవలపర్స్. అన్ని అనుమతులతో ఓపెన్ ప్లాట్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. విశాలమైన రోడ్లు, ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడిన ప్లాట్లు ప్రజలకు అందుబాటు ధరలలో లభిస్తున్నాయి.
– భీమప్ప, మార్కెటింగ్ డైరెక్టర్, వల్లేరు డెవలపర్స్