ఖలీల్వాడి, మే 29: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సీఎం కేసీఆర్ను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల మాక్లూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే బిగాల సోదరులు నిర్మించిన అయ్యప్ప సహిత ఆంజనేయ శివపంచాయతన సహిత శ్రీ రుక్మిణీ పాండురంగ విఠలేశ్వరాలయాల్లో విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు మూడురోజులపాటు వైభవంగా నిర్వహించారు.
ఈ నేపథ్యంలో ఆలయ ప్రసాదాన్ని సీఎం కేసీఆర్కు ఎమ్మెల్యే బిగాల అందజేశారు. ఆలయాల విశిష్టతను వివరించారు. తన తండ్రి కృష్ణమూర్తి సంకల్పాన్ని నెరవేర్చి, ఆలయాన్ని గ్రామస్తులకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. బిగాల సోదరులను ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అభినందించారు.