కమ్మర్పల్లి, ఫిబ్రవరి 26 : బీఆర్ఎస్ పార్టీకి దేశ వ్యాప్తంగా ఆదరణ లభిస్తున్నదని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. దేశానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి గ్రామానికి చెందిన బీజేపీ, బీఎస్పీ నాయకులు కొమ్ముల వెంకన్న, కొట్టాల రాజేశ్వర్, బద్దం రాజేశ్వర్, బేల్దారి సందీప్, బేల్దారి ప్రవీణ్, వంజరి గణేశ్, ఏలేటి రాంచందర్, కుర్మా మహేశ్ ఆదివారం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరినవారు మాట్లాడుతూ.. కేసీఆర్ జనరంజక పాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాలు, బాల్కొండ నియోజక వర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులమై బీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు. మంత్రి వేముల మాట్లాడుతూ బీఆర్ఎస్కు రోజురోజుకూ దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతున్నదని అన్నారు. సీఎం కేసీఆర్ మన రాష్ట్రంలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా కావాలనే డిమాండ్ ప్రజల్లోంచి వస్తోందని తెలిపారు. హైదరాబాద్లోని మంత్రి నివాసంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ మారు శంకర్, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆరెల్లి నవీన్, మాజీ సర్పంచ్ రాజన్న, నాయకులు కొమ్ముల రాజేందర్, బట్టు అశోక్, రాజేశ్వర్, సుమన్, రంజిత్, మహేశ్, ముత్తెన్న, తోట శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.