రెంజల్, ఫిబ్రవరి 20 : రైతులు పండించిన ప్రతి పంటకూ మద్దతు ధరతో కొనుగోలు చేస్తూ .. రైతుసేవలో అహర్నిశలు తరించే రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి అన్నారు. సోమవారం నీలా సహకార సంఘం మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శనగ కొనుగోలు కేంద్రా న్ని నీలా విండో చైర్మన్ ఇమ్రాన్బేగ్తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. దళారీల వ్యవస్థకు స్వస్తి పలికేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సాగు చేసిన శనగలను ప్రభుత్వం క్వింటాలుకు రూ.5,335 ధరతో కొనుగోలు చేస్తు న్నదని అన్నారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో 78 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
రైతుల ఖాతాల్లో 10 నుంచి 15 రోజుల్లో డబ్బులు జమ చేస్తామని అన్నారు. ఆదిలాబాద్లో 99వేల ఎకరాలు, కామారెడ్డిలో 84 వేలు, నిర్మల్లో 18 వేలు, గద్వాల్లో 1,350, ఆసిఫాబాద్లో 5వేల ఎకరాలు, రంగారెడ్డిలో 4వేల ఎకరాల్లో రైతులు శనగ పంటను పండిస్తున్నట్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో 24వేల ఎకరాల్లో రైతులు సాగు చేయగా, మొదటగా రెంజల్ మండలం నీలా సహకార సంఘంలోనే కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. రైతులు పండించిన చివరి గింజ వరకూ కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటామని స్పష్టం చేశారు.
జిల్లాలో ఎరువుల కొరత లేదని, అవసరం మేరకు అందించేలా జిల్లా అధికారులను అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నీలా, రెంజల్ విండో చైర్మన్లు ఇమ్రాన్బేగ్, మొహినుద్దీన్, సర్పంచులు ఖలీంబేగ్, రమేశ్కుమార్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు భూమారెడ్డి, మైనార్టీ జిల్లా నాయకుడు రఫీక్, ఏవో లక్ష్మీకాంత్రెడ్డి, ఎంపీటీసీ అసద్బేగ్, బీఆర్ఎస్ మండల నాయకులు రాఘవేందర్, గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.