డిచ్పల్లి, మార్చి 6: మండలంలోని మాధవ్నగర్ రైల్వేలెవల్ క్రాసింగ్ గేటు తెరుచుకున్నది. రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల దృష్ట్యా జనవరి 25న రైల్వే ఉన్నతాధికారులు మాధవ్నగర్ గేటును మూసివేశారు.
39రోజుల తర్వాత బుధవారం మధ్యాహ్నం రైల్వే గేటు నుంచి రాకపోకలు ప్రారంభమయ్యాయి. రాకపోకలు సాఫీగా జరిగేందుకు గేటుకు ఇరువైపులా రైల్వే అధికారులు బీటీ రోడ్డును వేశారు.