మాక్లూర్, ఫిబ్రవరి 6: కంటి సమస్యలున్న వారు కంటి వెలుగు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు అన్నారు. మండలంలోని ధర్మోరా గ్రామంలో సోమవారం కంటి వెలుగు శిబిరాన్ని ఎంపీపీ మాస్త ప్రభాకర్తో కలిసి జడ్పీ చైర్మన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ అవసరమున్న వారికి మందులు, కండ్ల అద్దాలను ఉచితంగా ప్రభుత్వం అందజేస్తున్నదని అన్నారు. ఆపరేషన్లు అవసరమున్న వారికి ఇతర దవాఖానలకు రిఫర్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శైలజా గంగాధర్, ఎంపీటీసీ పురుషోత్తంరావు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సుక్కి సుధాకర్, గంగాధర్, అమృత్, మల్లేశ్, రవి పాల్గొన్నారు.
సీఎం, ఎమ్మెల్యే చిత్ర పటాలకు క్షీరాభిషేకం
రైతులకు రూ.లక్ష వ్యవసాయ రుణమాఫీ కోసం బడ్జెట్లో నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ధర్మోరా గ్రామంలో సీఎం కేసీఆర్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి చిత్రపటాలకు జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠల్రావు, ఎంపీపీ మాస్త ప్రభాకర్ కలిసి క్షీరాభిషేకం చేశారు. చైర్మన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని అన్నారు. సంక్షేమ రంగానికి బడ్జెట్లో పెద్దపీట వేశారని సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
కంటివెలుగు శిబిరం పరిశీలన
శక్కర్నగర్, ఫిబ్రవరి 6: బోధన్ పట్టణంలోని 24వ వార్డులో ఏర్పాటు చేసిన కంటివెలుగు శిబిరాన్ని మున్సిపల్ కమిషనర్ ఎండీ ఖమర్ అహ్మద్తోపాటు పలువురు కౌన్సిలర్లు పరిశీలించారు. శిబిరంలో ఏవైనా ఇబ్బందులుంటే స్థానిక కౌన్సిలర్ల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు సుధారాణి, తూము శరత్రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఆలూర్లో..
ఆలూర్, ఫిబ్రవరి6: మండల కేంద్రంలో కంటి వెలుగు శిబిరాన్ని ఎంపీపీ పస్క నర్సయ్య ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, సర్పంచ్ మోహన్రెడ్డి, వైస్ ఎంపీపీ చిన్నారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
మంగళ్పాడ్ గ్రామంలో..
ఎడపల్లి, ఫిబ్రవరి6: మండలంలోని మంగళ్పాడ్ గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని సర్పంచ్ హన్మాండ్లు, ఆయుష్ డాక్టర్ వెంకటేశ్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ వనజా నాగరాజు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
కొనసాగుతున్న శిబిరం
డొంకేశ్వర్, ఫిబ్రవరి6: మండల కేంద్రంలో కంటివెలుగు శిబిరం కొనసాగుతోంది. 18 ఏండ్లు పైబడిన అందరికీ కంటి పరీక్షలు చేస్తామని మెడికల్ ఆఫీసర్ సుచిత్ర అన్నారు. శని, ఆదివారాలు మినహా అన్ని రోజుల్లో కంటి పరీక్షలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
జక్రాన్పల్లి మండలంలో..
జక్రాన్పల్లి, ఫిబ్రవరి6: మండలంలోని జక్రాన్పల్లి, మునిపల్లి, రామడుగు తదితర గ్రామాల్లో కంటి వెలుగు శిబిరాలు కొనసాగుతున్నాయి. వైద్యసిబ్బంది కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి కంటి అద్దాలను అందజేస్తున్నారు. జక్రాన్పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కంటివెలుగు శిబిరాన్ని ఎంపీడీవో లక్ష్మణ్ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. మోతిబిందు ఆపరేషన్ అవసరమున్న వారి పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.