ఇందూరు, అక్టోబర్ 22 : ఇందూరు నగరంలో ప్రముఖ సినీ నటి కృతిశెట్టి శనివారం సందడి చేశారు. జోస్ ఆలుక్కాస్ గ్రూప్ తమ సరికొత్త జువెలరీ షోరూమ్ను స్థానిక ద్వారకానగర్లో ఏర్పాటుచేయగా.. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా, సినీనటి కృతిశెట్టి, జోస్ ఆలుక్కాస్ చైర్మన్ జోస్ ఆలుక్కా, మేనేజింగ్ డైరెక్టర్ వర్గిస్ ఆలుక్కా, పాల్జె ఆలుక్కా, జాన్ ఆలుక్కా ప్రారంభించారు. సినీతార కృతిశెట్టి, నగర మేయర్ నీతూకిరణ్ జ్యోతిప్రజ్వలన చేసి ఆభరణాలను ప్రదర్శించారు.
ఇక్కడి అభిమానుల ఉత్సాహం చూస్తుంటే ఆనందమేస్తుందని ఈ సందర్భంగా నటి కృతిశెట్టి పేర్కొన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మె ల్యే బిగాల గణేశ్గుప్తా మాట్లాడుతూ మహానగరాలకు పరిమితమైన జువెలరీ షాపులు నిజామాబాద్లో ప్రారంభించడం శుభపరిణామమన్నారు. 58 సంవత్సరాలుగా విశ్వసనీయత, స్వచ్ఛతకు మారుపేరుగా నిలుస్తున్న జోస్ ఆలుక్కాస్ నిజామాబాద్కు రావడం అభినందనీయమన్నారు. నగరంలో శాంతిభద్రతల సమస్యలు లేవన్నారు.