బోధన్ : బోధన్ పట్టణానికి చెందిన పలువురు ఎంఐఎం నాయకులు సోమవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎంఐఎం నాయకులు లాయఖ్అలీ, అత్తావుల్లాతో పాటు వారి అనుచరులు బోధన్ ఎమ్మెల్యే షకీల్ సమక్షంలో పార్టీలో చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బోధన్ పట్టణ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్శితులై టీఆర్ఎస్లో చేరినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షకీల్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి పాటు పడుతుందని అన్నారు. బోధన్ పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నానని పేర్కొన్నారు.
ఇందులో బాగంగానే ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిపించామన్నారు. టీఆర్ఎస్కు చెందిన నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ కార్యక్రమాలను అందించాలని సూచించారు. ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రవీందర్ యాదవ్, అబ్దుల్ రహ్మాన్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.