ఎమ్మెల్సీ కవిత చిత్రపటాలకు గురువారం జిల్లావ్యాప్తంగా మహిళలు, బీఆర్ఎస్ నాయకులు క్షీరాభిషేకం చేశారు. ఆమె పోరాటంతోనే కేంద్రం మహిళా బిల్లును తీసుకువచ్చిందని గుర్తు చేసుకుంటూ సంబురాలు నిర్వహించారు.
కమ్మర్పల్లి, సెప్టెంబర్ 21 : కమ్మర్పల్లి మండల కేంద్రంలో మహిళా మండల సమాఖ్య ప్రతినిధులు, సెర్ప్ సిబ్బంది, సెర్ప్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, కమ్మర్పల్లి ఏంపీఎం కుంట గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చిత్రపటానికి గురువారం క్షీరాభిషేకం చేశారు. పార్లమెంటులో మహి ళా బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా..ఇందుకు కృషి చేసిన కవితకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కుంట గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ర్టాల ప్రధాన రాజకీయ పార్టీలతో కవిత ప్రత్యక్షంగా మాట్లాడి, ఒప్పించి మహిళా బిల్లుకు సన్నద్ధం చేశారన్నారు. ఢిల్లీ కేంద్రంగా పలుమార్లు దీక్ష చేసి బిల్లుకు ఆమోదించక తప్పని పరిస్థితిని సృష్టించారన్నారు.
జక్రాన్పల్లి, సెప్టెంబర్ 21 : మండల కేంద్రంలో ఎంపీపీ కుంచాల విమలారాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కోసం ఎమ్మెల్సీ కవిత ఎంతో కృషి చేశారని తెలిపారు. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడంపై సంతో షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తొర్లికొండ, బ్రాహ్మణపల్లి ఎంపీటీసీలు సంకెపల్లి పద్మ, పోతే రాజు, లక్ష్మి, పడకల్ సుజాత, మండల మహిళా ఉపాధ్యక్షురాలు జమున, డ్వాక్రా మహిళలు, ఐకేపీ, ఆశ కార్యకర్తలు, మండల కో-ఆప్షన్ మెంబర్లు అక్బర్ఖాన్ తదితరులు పాల్గొన్నారు.