సుభాష్నగర్, ఏప్రిల్ 2: జైశ్రీరాం.. జై హనుమాన్.. అంటూ భక్తుల నామస్మరణతో ఇందూరు వీధులన్నీ పులకించిపోయాయి. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని గురువారం జిల్లాకేంద్రంలో హిందూ వాహిని, బజరంగ్దళ్ అధ్వర్యంలో హనుమాన్ విజయయాత్రను ఘనంగా నిర్వహించారు. నీలకంఠేశ్వరాలయం వద్ద శోభాయాత్ర రథానికి పండితులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు.
కంఠేశ్వర్ నుంచి ఆర్ఆర్ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగగా, ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తి పారవశ్యంతో తేలియాడుతూ పాటలకు లయబద్ధంగా నృత్యాలు చేశారు. పలు స్వచ్ఛంద సంస్థలు పులిహోర, పండ్లు, మజ్జిగ, చల్లనీ నీటిని పంపిణీ చేశాయి. ర్యాలీలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా, నగర మేయర్ కూరగాయల ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.