రామారెడ్డి మండలంలోని రెడ్డిపేట్లో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ గురువారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. యువకులతో కలిసి కబడ్డీ, వాలీబాల్ ఆడి వారిలో ఉత్సాహం నింపారు.
రామారెడ్డి, డిసెంబర్ 8: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు బడుల్లో సౌకర్యాలను కల్పిస్తున్నట్లు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తోం దన్నారు. గురువారం ఆయన మండలంలోని రెడ్డిపేట్ గ్రామంలో పర్యటించారు. గ్రామంలో అభివృద్ధి పనులకు రూ.2.6 కో ట్లు మంజూరుకాగా, ఇందులో మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగం గా పాఠశాలలో అభివృద్ధి పనుల కోసం రూ.1.09 కోట్లు మంజూరయ్యా యి.
పాఠశాల భవనంతోపాటు అధునాతన సౌకర్యాలు కల్పించడానికి గ్రామస్తులు ఆర్కిటెక్చర్ను సంప్రదించగా.. దాదాపు రూ.మూడు కోట్ల వరకు ఖర్చవుతుందని తెలుసుకొన్నారు. దీంతో గ్రామస్తులు ప్రముఖవ్యాపార వేత్త తిమ్మయ్యగారి సుభాష్రెడ్డిని సంప్రదించారు. బీబీపేటలో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల మాదిరిగా నిర్మించడానికి సహకరించాలని కోరారు. స్పందించిన ఆయన తన సొంత ఖర్చుతో భవనం నిర్మిస్తానని ఇచ్చిన హామీ మేరకు గురువారం నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ శంకుస్థాపన చేశారు. గ్రామంలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణం, పల్లె ప్రకృతివనం, లైబ్రరీ, సీసీ రోడ్లును కూడా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విప్ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తోం దన్నారు. అనంతరం ఆయన గ్రామంలోని యువకులతో కలిసి వాలీబాల్, కబడ్డీ ఆడి ఉత్సాహపరిచారు. ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్యగారి సుభాష్రెడ్డి, సర్పంచ్ సునంద, ఎంపీపీ నారెడ్డి దశరత్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రంగు రవీందర్గౌడ్, ప్రధాన కార్యదర్శి బుచ్చిరెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ గురజాల నారాయణరెడ్డి, ఎంపీటీసీ గర్గుల్రాజాగౌడ్, డీఆర్డీవో సాయన్న, డీఎల్పీవో సాయిబాబా, ఎంపీడీవో విజయ్కుమార్, ఎంపీవో సవితారెడ్డి, టీఆర్ఎస్ యూత్ విభాగం మండల అధ్యక్షుడు గడ్డం రవీందర్, గ్రామ శాఖ అధ్యక్షుడు లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.