ఖలీల్వాడి/రుద్రూర్/డిచ్పల్లి/వర్ని/ చందూ ర్/కోటగిరి/నిజామాబాద్ రూరల్, జనవరి 1 : నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు ప్రజలు సంబురాల్లో మునిగితేలారు. శనివారం ఉదయం ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధికారులు, నాయకులు, ప్రముఖులు, ఉన్నతాధికారులను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. స్నేహసొసైటీలో మానసిక దివ్యాంగులు కేక్కట్ చేశారు. చిన్నారులతోపాటు సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య, ప్రిన్సిపాల్ జ్యోతి తదితరులు పలువురు ప్రముఖులను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్, తెలంగాణ నర్సింగ్హోమ్స్ అసోసియేషన్ సభ్యులు జిల్లా జడ్జి సునీత, కలెక్టర్ నారాయణరెడ్డి, డీఎంహెచ్వో సుదర్శనాన్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఐఎంఏ అధ్యక్షకార్యదర్శులు డాక్టర్ సుభాష్, డాక్టర్ జలగం తిరుపతిరావు, ఉపాధ్యక్షులు ఆకుల విశాల్, నీలి రాంచందర్, డాక్టర్ రాయుడి గోపీకృష్ణ, ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డాక్టర్ కవితా రెడ్డి, డాక్టర్ రామ్మోహన్రావు, డాక్టర్ డీఎల్ఎన్ స్వామి పాల్గ్గొన్నారు.
రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో నాయకులు కేక్ కట్ చేశారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. జడ్పీటీసీ నారోజి గంగా రాం, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, వైస్ ఎంపీపీ సాయిలు, విండో చైర్మన్ సంజీవ్రెడ్డి, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ సంగయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్ సంజీవ్, సోషల్ మీడియా ఇన్చార్జి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. డిచ్పల్లిలోని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీసు ఏడో బెటాలియన్లో కమాండెంట్ ఎన్వీ సత్యశ్రీనివాస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. బెటాలియన్ సిబ్బంది కమాండెంట్కు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అసిస్టెంట్ కమాండెంట్ సి.ఆంజనేయరెడ్డి, కె.భాస్కర్రావు, ఆర్ఐలు ఎం.రాజు, పి.వెంకటేశ్వర్లు, బి.అనిల్కుమార్, ఎల్.మహేశ్, ఎం.నరేశ్, వి.బాబురావు, కె.శ్యామ్రావు, ఆర్.ప్రహ్లాద్, బి.వసంత్రావు, ఆర్ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
వర్ని, చందూర్, కోటగిరి, ధర్పల్లి, నిజా మాబాద్ రూరల్ మండలాల్లో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. ఆలయాలు భక్తుల తో కిటకిటలాడాయి. నూతన సంవత్సరం సంద ర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరశివారులోని మాధవనగర్ సాయిబాబా ఆల యానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. భక్తులు కొవిడ్ నిబంధనలను పాటించేలా ఆలయ ఈవో శ్రీరాంరవీందర్గుప్తా ఆధ్వర్యంలో సిబ్బంది ఏర్పాట్లు చేశారు.