ఎల్లారెడ్డి రూరల్, జనవరి 12: ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి సమీర్ అరుదైన ఘనత సాధించాడు. హిమాచల్ప్రదేశ్లోని ధర్మశాలలో ఈ నెల 2 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన జాతీయ ఎన్ఎస్ఎస్ శిబిరంలో పాల్గొన్నాడు. ఇందులోభాగంగా ఈ నెల 10న ట్రైనర్ సోనమ్ సహాయంతో సముద్ర మట్టానికి 2875 మీటర్ల ఎత్తులో ఉన్న హిమాలయ శిఖరం ట్రైఎండ్ ఆల్టిట్యూడ్ను సమీర్ అధిరోహించినట్లు శిబిర నిర్వాహకులు తెలిపారు. ఈ ఘనత సాధించిన సమీర్ను ఎల్లారెడ్డి ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, తెలంగాణ యూనివర్సిటీ సిబ్బంది అభినందించారు.