భీమ్గల్/వేల్పూర్, డిసెంబర్ 23: మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా విద్యాధికారి దుర్గాప్రసాద్ అన్నారు. శుక్రవారం మండలంలోని బెజ్జొరా, ముచ్కూర్, పిప్రి పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ కొనసాగుతున్న పనులను పరిశీలించారు. సకాలంలో పనులను పూర్తి చేయాలని సదరు కాంట్రాక్టర్కు సూచించారు. డీఈవో వెంట ఎంపీడీవో రాజేశ్వర్, ఎంఈవో స్వామి, ఏఈ రఘు, ఎంపీవో గంగామోహన్, సర్పంచులు ప్రతిభ, జ్యోతి, ప్రవీణ్, ఎంపీటీసీలు గంగస్వామి, రాజేశ్వర్, నర్సయ్య, హెచ్ఎంలు ఉన్నారు.
వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను జిల్లా విద్యాధికారి ఎన్వి.దుర్గాప్రసాద్ తనిఖీ చేశారు. 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. ప్రత్యేక తరగతుల నిర్వహణ తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులకు పలు సూచనలు ఇచ్చారు. డీఈవో వెంట ప్రధానోపాధ్యాయుడు రాజన్న, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు గంట అశోక్, పవన్కుమార్, దేవానందం, గంగాధర్ ఉన్నారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు