మాచారెడ్డి, ఆగస్టు 26 : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని పాల్వంచ గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేస్తూ చీఫ్ సెక్రటరీ సోమేశ్కుమార్ ప్రిలిమినరీ నోటిఫికేషన్ను శుక్రవారం విడుదల చేశారు. దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే 15 రోజుల్లో తెలపాలని సూచించారు.
మాచారెడ్డి మండలంలో 33 గ్రామపంచాయతీలు ఉండగా 12 గ్రామాలైన పాల్వంచ, వాడి, యేల్పుగొండ, బండరామేశ్వర్పల్లి, ఫరీద్పేట, భవానీపేట, పోతారం, ఇసాయిపేట, మంథనిదేవునిపల్లి, ఆరెపల్లి, భవానీపేటతండా, రామారెడ్డి మండలంలోని సింగరాయిపల్లిని కలుపుతూ నూతన మండల ఏర్పాటుకు ఉత్తర్వు లు జారీ అయ్యాయి. 15 రోజుల క్రితం ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ పాల్వంచ మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రతిపాదన పంపించారు. దానికి ఆమోద ముద్రవేసి ప్రిలిమినరీ నోటిఫికేషన్ను విడుదల చేశారు.