కోటగిరి, సెప్టెంబర్ 29: పొతంగల్ను నూతన మండలంగా ఏర్పాటు చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు గ్రామస్తులు, నాయకులు గురువారం పొతంగల్ బస్టాండ్ వద్ద సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం పటాకులు కాల్చారు. మిఠాయిలు పంచుకొని సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. కోటగిరి మండలాన్ని విభజించి 14 రెవెన్యూ గ్రామాలతో కలిపి పొతంగల్ను నూతన మండలంగా ఏర్పాటు చేశారని తెలిపారు.
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని కృషి చేయడంతోనే పొతంగల్ మండలంగా ఏర్పాటైందన్నారు. ఈ సందర్భంగా స్పీకర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఎజాజ్ఖాన్, పొతంగల్ విండో చైర్మన్ శాంతేశ్వర్పటేల్, వైస్ చైర్మన్ గంధపు పవన్, సర్పంచ్ వర్ని శంకర్, జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ సిరాజ్, మండల కో-ఆప్షన్ మెంబర్ ఇస్మాయిల్, గంట్ల విఠల్, కాశాగౌడ్, దిలీప్, కోటగిరి మండల నాయకులు వల్లెపల్లి శ్రీనివాస్, నీరడి గంగాధర్, కేశ వీరేశం, మాణికప్పా, విజయ్పటేల్, చాకూరే గంగాధర్, సుంకిని సర్పంచ్ మాధవ్రావు, కొల్లూర్ సంపత్, జుమ్మాఖాన్, సాబేర్, గూడు, సందాని తదితరులు పాల్గొన్నారు.