చంద్రయాన్-3 విజయవంతంతో ఉమ్మడి జిల్లాలో సంబురాలు నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలల్లో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా చంద్రుడిపైకి చేరడంతో జయహో భారత్.. జయహో ఇస్రో అంటూ నినాదాలు చేశారు. పలుచోట్ల యువకులు పటాకులు కాల్చి, మిఠాయిలు తినిపించుకొని సంబురాలు జరుపుకొన్నారు.