ఖలీల్వాడి/ డిచ్పల్లి/మాక్లూర్/ సిరికొండ, నవంబర్ 28 : సామాజిక విప్లవకారుడు, సంఘసంస్కర్త జ్యోతిబాపూలే 132వ వర్ధంతిని జిల్లాకేంద్రంతోపాటు పలు మండలాలు, గ్రామాల్లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
జిల్లాకేంద్రంలోని కేర్ డిగ్రీ కళాశాలలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఫూలే వర్ధంతిని నిర్వహించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్, దర్శనం దేవేందర్, పోల్కం గంగాకిషన్, కొయ్యాడ శంకర్, ఏగొండ స్వామి, సత్యనారాయణ, అనిల్, గోపి, బసవకుమార్, గంగాధర్ పాల్గొన్నారు.
నగరంలో శబ్దతరంగిణి ఆధ్వర్యంలో పూలే వర్ధంతిని నిర్వహించారు. కార్యక్రమంలో అధ్యక్షుడు సేర్ల దయానంద్, గుర్రం ప్రకాశ్రావు, బొట్టు వెంకటేశ్, రవి, దయానంద్, సురేశ్, లక్ష్మీనర్సింహులు, ప్రకాశ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
జిల్లాకేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో ఫూలే వర్ధంతిని నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యదర్శి రమేశ్బాబు, పెద్ది వెంకట్రాములు, నూర్జహాన్, శంకర్గౌడ్, విశాల్ తదితరులు పాల్గొన్నారు.
టీయూలో ఫూలే చిత్రపటానికి విద్యార్థి సంఘాల నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పూలే సంఘ సంస్కర్తగా కుల వ్యవస్థ, మహిళల విద్య కోసం సత్యశోధక సమాజం (1873) స్థాపించి సమాజం కోసం కృషి చేశారన్నారు. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 6 (అంబేద్కర్ వర్ధంతి) వరకు మహనీయుల వర్ధంతులను నిర్వహిస్తామని, ఈ రోజులను సామాజిక న్యాయ పోరాట దినాలుగా పాటించాలని కోరారు. తెలంగాణ సామాజిక ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర కో-కన్వీనర్ తలారి నరేశ్, కాట్రాజ్ మల్లేశ్, అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ (ఏఎస్ఏ) విజయ్, యూనివర్సిటీ స్వేరోస్ అధ్యక్షుడు శరత్ సాయిబాబా, ఆంజనేయులు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
మాక్లూర్ మండలంలోని దాస్నగర్లో ఉన్న జ్యోతిబా ఫూలే బాలికల పాఠశాలలో ఫూలే వర్ధంతిని నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు సంజీవ్రెడ్డి, ఏటీపీ సుమలత, డిప్యూటీ వార్డెన్ అర్బన, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సిరికొండ మండలంలోని సత్యశోధక్ పాఠశాలలో ప్రిన్సిపాల్ ఆర్.నర్సయ్య ఆధ్వర్యంలో ఫూలే వర్ధంతిని నిర్వహించారు. ఫూలే గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.