నిజామాబాద్ : తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. శనివారం నిజామాబాద్ అర్బన్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి సంస్థని స్థాపించి తెలంగాణ సంస్కృతిని బతుకమ్మ పండుగ ద్వారా ప్రపంచానికి తెలిసేలా చేశారని కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడబిడ్డలకు బతుకమ్మ కానుకగా బతుకమ్మ చీరలను పంపిణీ చేయడంతో మహిళలు సంతోషంగా ఉన్నారని వెల్లడించారు. బతుకమ్మ చీరల తయారీతో చేనేతలకు ఉపాధి కల్పించడంతోపాటు తెలంగాణ ఆడబిడ్డలకు చీరలను అందేలా చూసారని అన్నారు.
నగర ప్రజలు బతుకమ్మ, దసరా పండుగను ఘనంగా జరుపుకోవాలని కోరారు. అనంతరం నగరంలోని 13వ డివిజన్లో ఉన్న డైయిరీ ఫామ్ రోడ్లో బీటీ రోడ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగరమేయర్ దండు నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, డిప్యూటీ మేయర్ ఇద్రిస్ఖాన్ తదితరులు పాల్గొన్నారు.