ధర్పల్లి, జనవరి 28 : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మండలంలోని ప్రాజెక్టు రామడుగు గ్రామానికి చెందిన బీజేపీ సొసైటీ డైరెక్టర్లు, నాయకులు, యూత్ సభ్యులు మొత్తం 52మంది బాజిరెడ్డి సమక్షంలో శనివారం బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు నచ్చక ఆ పార్టీని వీడుతున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేవన్నారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో సొసైటీ డైరెక్టర్ చిన్న గంగారెడ్డి, రమేశ్రెడ్డి, యువజన విభాగం నాయకులు చందు, ప్రశాంత్, విక్కీ, నరేశ్, ధన్రాజ్, అఖిల్, ఫణికుమార్, నిఖిల్, ప్రణయ్, వినయ్, భాస్కర్, సాయి, విజయ్, శేఖర్, సాయిలు, రమేశ్, నర్సారెడ్డి, భూమారెడ్డి, గంగారెడ్డి, మల్లేశ్, సంజీవ్, శ్రీనివాస్ యాదవ్, అభిరామ్, రాజారెడ్డి, రాజన్న, గంగాధర్, ముచ్చారెడ్డి, హన్మాండ్లు, శ్రీకాంత్, మహేందర్, శ్రీధర్గౌడ్, ప్రవీణ్ ఉన్నారు. జిల్లా కేంద్రంలోని బాజిరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, బీఆర్ఎస్ నాయకులు మహిపాల్ యాదవ్, నల్ల హన్మంత్రెడ్డి, వైస్ ఎంపీపీ కె.నవీన్రెడ్డి, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు రమేశ్గౌడ్, నాయకులు పసుల గంగాధర్, రాజారెడ్డి, నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.