New Pensions | పోతంగల్, ఆగస్టు 7 : కొత్త పింఛన్ల కోసం పోతంగల్ మండలంలో అర్హులైన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో చందర్ కోరారు. ఈ మేరకు ఎంపీడీవో శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలు కలిగిన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత, గీతా ఇతర అర్హులైన వారు సంబంధిత గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. అవసరమైన ధ్రువీకరణ పత్రాలను జత చేయాలని చెప్పారు. అర్హులైన వారికి ప్రభుత్వ నిబంధనల మేరకు పింఛన్లు మంజూరు అవుతాయని చెప్పారు.