డిచ్పల్లి, సెప్టెంబర్ 13 : జక్రాన్పల్లి మండలంలో ని చింతలూర్ గ్రామానికి చెందిన ఆదర్శ రైతు చిన్నికృష్ణుడికి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు ద క్కింది. 30 ఏండ్లుగా సేంద్రియ పద్ధతిలో పంటలను సాగు చేస్తూ వివిధ రకాల పంటలను పండి స్తూ పలువురు రైతులకు ఆదర్శంగా నిలిచారు చిన్నికృష్ణుడు. ఇటీవల ‘మా అమ్మనాన్న – చిన్నికృష్ణు డు’ అనే చిత్రాన్ని ఎకరం వరి పొలంలో గీయించా రు. ఇందులో భాగంగా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు మంగళవారం చింతలూర్ గ్రామంలో వరి పొలంలో గీసిన చిత్రాన్ని పరిశీలించారు.
తల్లిదండ్రుల చిత్రాన్ని వరి పొలంలో గీసి తన ప్రేమను చాటుకున్న చిన్నికృష్ణుడికి వండర్ బుక్ ఆఫ్ రికా ర్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ , తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం దక్కింది. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ బింగి నరేందర్గౌడ్, తెలంగాణ కోఆర్డినేటర్ సింగారపు శివరామకృష్ణ, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తెలంగాణ కోఆర్డినేటర్ నరేశ్కుమార్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపక చైర్మన్ చింతపట్ల వెంకటాచారి సర్టిఫికెట్లను అందజేశారు.ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి నరేందర్గౌడ్ మాట్లాడుతూ 72 ఏండ్ల వయస్సులో చిన్నికృష్ణుడు తన తల్లిదండ్రులను ఈ విధంగా చూసుకోవడం అభినందనీయమన్నారు. అనంతరం చిన్నికృష్ణుడు మాట్లాడుతూ సేంద్రియ పద్ధతిలో పంటలు సాగు చేయడంతో ఈ అవార్డు లభించిందన్నారు. రానున్న రోజుల్లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సాధించడమే లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ పు ప్పాల సుకన్య, జిల్లా వ్యవసాయాధికారి తిరుమల ప్రసాద్, కొలిప్యాక్ సొసైటీ చైర్మన్ నాగుల శ్రీనివాస్, ఏవో దేవిక, రైతులు పాల్గొన్నారు.