హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): ఈ-పంచాయతీలో జాతీయస్థాయిలో అవార్డు సాధించినందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అభినందించారు. గురువారం ప్రగతిభవన్లో తనను కలిసిన దయాకర్రావుకు కేటీఆర్ పూలమొక్క ఇచ్చి ప్రశంసించారు. ఇదే రకమైన పనితీరుతో మరిన్ని అవార్డులు తీసుకురావాలని ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ కృషి, ముందుచూపే అవార్డు రావడానికి కారణమని దయాకర్రావు తెలిపారు. తమకు అన్నివిధాలుగా సహకరిస్తున్న కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ర్టానికి ఇప్పటికే 12 అవార్డులు వచ్చాయని గుర్తుచేశారు. దయాకర్రావును మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూడా అభినందించారు.