గ్లోబల్ గేట్ వే దేనికి సంబంధించింది? (సి) ఎ) ఏయూకేయూఎస్ బి) షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సి) యూరోపియన్ యూనియన్ డి) బ్రిక్స్ వివరణ: అంతర్జాతీయ మౌలిక వసతుల రంగానికి సంబంధించి యూరోపియన్ యూనియన్ (ఈయూ) రూపొందించిన బృహత్తర ప్రణాళిక కు గ్లోబల్ గేట్ వే అని పేరు పెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా రవాణా, డిజిటల్, ఇంధన, ఆరోగ్య సేవల అనుసంధానతను బలోపేతం చేయాలన్న సంకల్పంతో దీనిని ఈయూ ప్రతిపాదించింది. ఇందులో భాగంగా 2027 నాటికి వివిధ దేశాల్లో రూ.25 లక్షల కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి ప్రాజెక్ట్ చేపట్టాలని భావిస్తుంది. అంతర్జాతీయంగా ప్రాబల్యం పెంచుకొనేందుకు చైనా 2013లో బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్కు శ్రీకారం చుట్టింది. దీనికి ప్రతిగా యూరోపియన్ యూనియన్ చేపట్టిన ప్రాజెక్ట్ గ్లోబల్ గేట్ వే.
బిల్డ్ బ్యాక్ బెటర్ వరల్డ్ అనేది ఏ దేశానికి సంబంధించిన ప్రాజెక్ట్? (డి) ఎ) ఫ్రాన్స్ బి) జపాన్ సి) ఆస్ట్రేలియా డి) అమెరికా వివరణ: బిల్డ్ బ్యాక్ బెటర్ వరల్డ్ అనేది అమెరికా రూపొందించిన ప్రాజెక్ట్. దీనినే బి2డబ్ల్యూ గా వ్యవహరిస్తారు. చైనా రూపొందించిన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్కు ప్రతిగా బి2డబ్ల్యూను అమెరికా ప్రతిపాదించింది. వాస్తవానికి దీనిని జీ7 ప్రకటించింది. కొవిడ్-19 వల్ల చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థల పునర్ నిర్మాణానికి ఇది ఉపయోగపడుతుంది. మౌలిక సదుపాయాలను చిన్న దేశాల్లో చేపడుతారు. పర్యావరణం, ఆరోగ్యం, ఆరోగ్య భద్రత, డిజిటల్ టెక్నాలజీ, లింగ సమానత్వ సాధన తదితర అంశాలే ప్రాతిపదికగా ఈ ప్రాజెక్ట్లో పెట్టుబడులు పెడుతారు.
బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్లో భాగంగా తొలి సీమాంతర ప్రాజెక్ట్, చైనా నుంచి ఏ దేశానికి రైలును ప్రారంభించారు? (సి) ఎ) పాకిస్థాన్ బి) నేపాల్ సి) లావోస్ డి) ఉత్తరకొరియా వివరణ: చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్ఐ) ప్రాజెక్ట్లో భాగంగా డిసెంబర్ 3న చైనాలోని యునాన్ ప్రావిన్స్లోని కున్మింగ్ నుంచి లావోస్ రాజధాని వియాంటియాన్కు రైలు మార్గం ప్రారంభమైంది. బీఆర్ఐలో ఇది తొలి సీమాంతర ప్రాజెక్ట్. దీని నిర్మాణాన్ని 2016లో ప్రారంభించారు. 600 కోట్ల డాలర్లను దీనికి వెచ్చించారు. 1035 కిలోమీటర్ల ఈ రైలు మార్గం కున్మింగ్ను, వియాంటియాన్ను కలుపుతుంది. సాధారణంగా లావోస్ రాజధాని నుంచి చైనా సరిహద్దుకు చేరడానికి రెండు రోజులు పడుతుంది. ఈ రైలుతో ఆ సమయం మూడు గంటలకు పరిమితం కానుంది.
ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ సూచీ ప్రకారం ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం? ( బి) ఎ) టోక్యో బి) టెల్ అవీవ్ సి) మాడ్రిడ్ డి) పారిస్ వివరణ: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరంగా ఇజ్రాయిల్లోని టెల్ అవీవ్ నిలిచింది. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనే సంస్థ ఈ జాబితాను రూపొందించింది. వరల్డ్ కాస్ట్ ఆఫ్ లివింగ్-2021 పేరుతో ఈ నివేదికను విడుదల చేసింది. ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో ప్రపంచ వ్యాప్తంగా 173 నగరాల్లో ఉన్న నిత్యావసర వస్తువుల ధరలు, ఇంటి అద్దె, రవాణా తదితర వ్యయాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ జాబితాలో తొలిసారిగా టెల్ అవీవ్ తొలి స్థానంలో నిలిచింది. పారిస్, సింగపూర్, సమాన పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. తర్వాతి స్థానాల్లో వరుసగా జ్యూరిచ్ (స్విట్జర్లాండ్), హాంకాంగ్లు ఉన్నాయి.
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనే పదవిని సూచించిన కమిటీ? (డి) ఎ) కార్గిల్ సమీక్ష కమిటీ బి) నరేశ్ చంద్ర టాస్క్ ఫోర్స్ సి) శేకత్కర్ కమిటీ డి) పైవన్నీ వివరణ: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనే పదవిని డిసెంబర్ 24, 2019లో ఏర్పాటు చేశారు. ఈ పదవిని చేపట్టిన తొలి వ్యక్తి బిపిన్ రావత్. హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన డిసెంబర్ 8న మరణించారు. ఈ పదవి ఉండాలని 1982లోనే కేవీ కృష్ణారావు సూచించారు. ఆయన భారత సైన్యాధిపతిగా పనిచేశారు. ఆ తర్వాత కార్గిల్ రివ్యూ కమిటీ కూడా ఈ పదవిని ఏర్పాటు చేయాలని చెప్పింది. దీనికి నేతృత్వం వహించింది నాటి సీనియర్ ఐఏఎస్ అధికారి కే సుబ్రమణ్యం. ఆ తర్వాత 2012లో నరేశ్ చ్రంద టాస్క్ ఫోర్స్, 2016లో శేకత్కర్ కమిటీలు కూడా ఈ పదవి ఏర్పాటును సూచించాయి. 2019 ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఈ పదవి ఏర్పాటును ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు.
వ్యవసాయ విద్యా సంస్థలకు ఇచ్చిన ర్యాంకింగుల్లో అగ్రస్థానంలో నిలిచిన విద్యా సంస్థ? (సి) ఎ) ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం బి) ఆచార్య జయశంకర్ వర్సిటీ సి) జాతీయ డెయిరీ పరిశోధన సంస్థ డి) కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం వివరణ: వ్యవసాయ విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలకు ఇచ్చిన ర్యాంకుల్లో హర్యానాలోని కర్నాల్లో ఉన్న జాతీయ డెయిరీ పరిశోధన సంస్థ అగ్రస్థానంలో నిలిచింది. ఇది డీమ్డ్ యూనివర్సిటీ. తెలంగాణ నుంచి ఈ జాబితాలో మూడు విద్యాలయాలకు చోటు దక్కింది. ఆచార్య జయశంకర్ వర్సిటీ 30వ స్థానంలో నిలిచింది. కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం 62వ స్థానంలో నిలువగా, పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం 64వ స్థానంలో చోటు దక్కించుకుంది.
బలవంతపు పెళ్లిళ్లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్న దేశం? (బి) ఎ) ఉత్తరకొరియా బి) అఫ్గానిస్థాన్ సి) ఇరాన్ డి) యూఏఈ వివరణ: వివాహానికి స్త్రీ అనుమతి తప్పనిసరి చేస్తూ అఫ్గానిస్థాన్లోని తాలిబన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బలవంతపు పెళ్లిళ్లను నిషేధించింది. పురుషులు, స్త్రీలు సమానం అని, స్త్రీలను ఆస్తిగా పరిగణించకూడదని తాజా ఉత్తర్వులో పేర్కొంది. అయితే వివాహానికి కనీస వయస్సును మాత్రం పేర్కొనలేదు. గతంలో ఇది 16 సంవత్సరాలుగా ఉంది.
100% వ్యాక్సినేషన్ సాధించిన తొలి రాష్ట్రం? (డి) ఎ) కేరళ బి) గోవా సి) హర్యానా డి) హిమాచల్ ప్రదేశ్ వివరణ: అర్హులైన ప్రజలు అందరికీ కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేసిన తొలి రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ ఘనత సాధించింది. రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన అందరికీ టీకాలు వేశారు. అర్హులైన ప్రజలు 53,86,393 మంది ఉన్నారు. అర్హులైన అందరికీ సింగిల్ డోస్ పూర్తిచేసిన తొలి రాష్ట్రంగా కూడా గతంలో హిమాచల్ ప్రదేశ్ ఘనతను దక్కించుకుంది.
టెస్ట్ క్రికెట్లో ఒక ఇన్నింగ్స్లో పది వికెట్లు తీసుకున్న వారిలో ఎవరు ఉన్నారు? (సి)
అనిల్ కుంబ్లే 2. షేన్ వార్న్
జిమ్ లేకర్ 4. అజాజ్ పటేల్ ఎ) 1, 2, 4 బి) 1, 4 సి) 1, 3, 4 డి) 1, 2, 3, 4 వివరణ: ఒకే ఇన్నింగ్స్లో పది వికెట్లు ఇప్పటి వరకు ముగ్గురు తీశారు. 1956లో ఆస్ట్రేలియాపై జిమ్ లేకర్ ఈ రికార్డ్ సృష్టించాడు. అతడు ఇంగ్లండ్ దేశస్థుడు. ఆ తర్వాత భారత్కు చెందిన అనిల్ కుంబ్లే 1999లో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో ఒకే ఇన్నింగ్స్లో పది వికెట్లు పడగొట్టాడు. ఇప్పటి వరకు ఈ ఘనత సాధించిన ఏకైక భారత బౌలర్ కుంబ్లేనే. ఇటీవల భారత్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్కు చెందిన అజాజ్ పటేల్ ఒకే ఇన్నింగ్స్లో పది వికెట్లు తీశాడు. ఈ టెస్ట్లో భారత్ 372 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంత భారీ తేడాతో భారత్ మ్యాచ్ను గెలవడం ఇదే ప్రథమం.
జూనియర్ హాకీ వరల్డ్ కప్ విజేతగా నిలిచిన జట్టు? (ఎ) ఎ) అర్జెంటీనా బి) జర్మనీ సి) భారత్ డి) జపాన్ వివరణ: పురుషుల జూనియర్ హాకీ ప్రపంచకప్లో అర్జెంటీనా విజయం సాధించింది. ఫైనల్లో జర్మనీతో పోటీపడింది. ఈ టోర్నీని గెలవడం అర్జెంటీనాకు ఇది ఆరోసారి. ఈ క్రీడలను ఒడిశాలోని కళింగ స్టేడియంలో నవంబర్ 24 నుంచి డిసెంబర్ 5 వరకు నిర్వహించారు. మొత్తం 16 జట్లు ఈ టోర్నీలో పాల్గొన్నాయి.
గీతా గోపీనాథ్ ఏ సంస్థలో విధులు నిర్వహిస్తున్నారు? (డి) ఎ) ప్రపంచ బ్యాంక్ బి) ప్రపంచ వాణిజ్య సంస్థ సి) యూఎన్సీటీఏడీ డి) అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వివరణ: అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలో ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా గీతా గోపీనాథ్ నియామకం అయ్యారు. ఈ సంస్థలో ఇది రెండో అత్యున్నత స్థానం. ఇప్పటి వరకు ఇదే సంస్థలో ఆమె ప్రధాన ఆర్థిక వేత్తగా ఉన్నారు. ఆమె భారతీయ అమెరికన్. 2019 నుంచి ఐఎంఎఫ్లో ప్రధాన ఆర్థిక వేత్తగా కొనసాగుతున్నారు. గతంలో ఆమె కేరళ ముఖ్యమంత్రికి ప్రధాన సలహాదారుగా కూడా సేవలు అందించారు. 2022లో ఆమె కొత్త బాధ్యతలను చేపట్టనున్నారు. ప్రస్తుతం ఆ పదవిలో జాఫ్రీ ఒకమోటో ఉన్నారు. ఆమె స్థానంలో గీతా గోపీనాథ్ బాధ్యతలు స్వీకరిస్తారు.
జర్మనీలో సుదీర్ఘ కాలం చాన్స్లర్గా కొనసాగింది ఎవరు? (సి) ఎ) ఏంజెలా మెర్కెల్ బి) ఒలాఫ్ షోల్స్ సి) హెల్మట్ కోల్ డి) డెస్మండ్ రామ్స్ వివరణ: జర్మనీ చాన్స్లర్గా సుదీర్ఘకాలం కొనసాగింది హెల్మట్ కోల్. 1982 నుంచి 98 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత ఎక్కువ కాలం ఆ పదవిని నిర్వహించింది ఏంజెలా మెర్కెల్. డిసెంబర్ 7న ఆమె బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. 2005లో జర్మన్ చాన్స్లర్గా బాధ్యతలు స్వీకరించిన ఆమె మరో వారం రోజుల పాటు పదవిలో కొనసాగి ఉంటే సుదీర్ఘకాలం ఆ దేశంలో ఈ పదవిని నిర్వహించిన వ్యక్తిగా నిలిచి ఉండేది. డిసెంబర్ 8న ఆమె స్థానంలో చాన్స్లర్గా ఒలాఫ్ షోల్స్ బాధ్యతలు స్వీకరించారు.
కేంద్రం విడుదల చేసిన జాతీయ ఆరోగ్య వ్యయ నివేదిక ప్రకారం తెలంగాణలో ఆరోగ్య వ్యయంలో 2014-15తో పోలిస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటా? (ఎ) ఎ) పెరిగింది బి) తగ్గింది సి) స్థిరంగా ఉంది డి) ఏదీకాదు వివరణ: మొత్తం ఆరోగ్య వ్యయంలో ప్రభుత్వ వాటా 2014-15తో పోలిస్తే 2017-18 నాటికి 17.5 శాతం పెరిగి 39.8 శాతానికి చేరిందని జాతీయ ఆరోగ్య వ్యయ నివేదిక పేర్కొంది. ఇదే సమయంలో మొత్తం ఆరోగ్య వ్యయంలో ప్రజల సొంత ఖర్చు కూడా 62.1 శాతం నుంచి 49.7 శాతానికి తగ్గింది. అంటే తలసరి వ్యయం రూ.2834 నుంచి రూ.2120కి తగ్గింది. రాష్ట్రంలో మాతా శిశు సంరక్షణ కోసం కేసీఆర్ కిట్ పథకం కింద ప్రోత్సాహక నగదు ఇవ్వడం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడం, తెలంగాణ డయాగ్నస్టిక్స్ పథకం కింద ఉచిత నిర్ధారణ పరీక్షలను అమలు చేయడంతో ప్రజలపై కొంత మేర ఆర్థిక భారం తగ్గిందని నివేదిక వెల్లడించింది.
ఆన్లైన్ ఆడిటింగ్లో దేశంలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం? (డి) ఎ) మధ్యప్రదేశ్ బి) గోవా సి) కేరళ డి) తెలంగాణ వివరణ: గ్రామ పంచాయతీల ఆన్లైన్ ఆడిట్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రం వంద శాతం ఆడిట్ను పూర్తి చేయగా ఇతర రాష్ర్టాలు సరాసరి 13 శాతం లక్ష్యాన్ని మాత్రమే చేరాయి. తెలంగాణ తర్వాత రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఆ రాష్ట్రం 49 శాతం లక్ష్యాన్ని చేరింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 12,769 గ్రామ పంచయతీల్లో ఈ ప్రక్రియ చేపట్టారు.
డిసెంబర్ 2ను ఏ రోజుగా నిర్వహిస్తారు? (సి)
ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం
జాతీయ కాలుష్య నియంత్రణ రోజు ఎ) 1 బి) 2 సి) 1, 2 డి) ఏదీకాదు వివరణ: ఏటా డిసెంబర్ 2న ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవంతో పాటు భారత దేశంలో జాతీయ కాలుష్య నియంత్రణ రోజుగా నిర్వహిస్తారు. ప్రముఖ ప్రైవేట్ సంస్థ నిట్, భారత్లో కంప్యూటర్ శిక్షణను ప్రారంభించింది. 2001 డిసెంబర్ 2 నాటికి ఆ సంస్థ లక్ష మందికి కంప్యూటర్ను నేర్పించింది. ఈ సందర్భంగా ఈ రోజును ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత రోజుగా నిర్వహిస్తున్నారు. భోపాల్ గ్యాస్ దుర్ఘటన 1984 డిసెంబర్ 2 అర్ధరాత్రి జరిగింది. మిథైల్ ఐసోసైనైట్ విడుదల కావడంతో లక్షల మంది చనిపోయారు. అందుకే ఆ రోజును కాలుష్య నియంత్రణ రోజుగా నిర్వహిస్తారు.