న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (JE) పోస్టుల నియాక ప్రక్రియను స్టాఫ్ సెలెక్షన్ కమిటీ (SSC) చేపట్టింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. అర్హులైనవారు వచ్చే నెల 2 వరకు ఆన్లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. సివిల్, మెకానికల్, ఎలక్రికల్, క్వాలిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్స్ డిసిప్లెయిన్స్ విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి. అయితే ఖాళీల సంఖ్యను నియామక బోర్డు వెల్లడించలేదు. పరీక్ష సమయానికి ఎన్ని పోస్టులు ఉన్నాయనే అంశాన్ని ప్రకటించనుంది.
ఏ పోస్టులు ఎక్కడంటే..
సెంట్రల్ వాటర్ కమిషన్లో.. జూనియర్ ఇంజినీర్ సివిల్, మెకానికల్
సీపీడబ్లూడీలో.. సివిల్, ఎలక్ట్రికల్
ఎంఈఎస్, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్లో జేఈ సివిల్, మెకానికల్ అండ్ మెకానికల్
సెంట్రల్ వాటర్ పవర్ రిసెర్చ్ స్టేషన్లో.. జేఈ మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్
డైరెక్టరేట్ ఆఫ్ క్వాలిటీ అస్యూరెన్స్లో.. జేఈ మెకానికల్, ఎలక్ట్రికల్
ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్టులో.. జేఈ సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్
నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్లో.. ఎలక్ట్రికల్, మెకానికల్ పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత విభాగంలో బీటెక్ లేదా డిప్లొమా చేసి 30 ఏండ్లలోపు వయస్సు కలిగినవారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా. మొత్తం రెండు పేపర్లు ఉంటాయి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్
అప్లికేషన్ ఫీజు: రూ.100, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్సర్వీస్మెన్, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 2
రాత పరీక్ష: నవంబర్ నెలలో
వెబ్సైట్: www.ssc.nic.in