న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ లిగ్నైట్ అండ్ కోల్ ఇండియా లిమిటెడ్ (NLCIL) ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 65 ఎస్ఎంఈ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 14 వరకు అందుబాటులో ఉంటాయి. ప్రాక్టికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఉద్యోగాలకు ఎంపికైనవారు తమిళనాడులోని నైవేలీలో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 65
ఇందులో జనరల్ 30, ఎస్సీ 12, ఓబీసీ 17, ఈడబ్ల్యూఎస్ 6 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: పదో తరగతి, ఎస్ఎస్ఎల్సీ, ఐటీఐ మెకానికల్, ఎలక్రికల్ ట్రేడ్లలో ఏదో ఒకటి చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ప్రాక్టికల్ టెస్ట్ ద్వారా. ఎంపిక చేసిన అభ్యర్థులను ప్రాక్టికల్ టెస్ట్కు ఆహ్వానిస్తారు. ఈ పరీక్ష 50 మార్కులకు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 14
వెబ్సైట్: https://www.nlcindia.in/