ఢిల్లీ: దేశవ్యాప్తంగా సైనిక స్కూల్స్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న పరీక్షల తేదీ మారింది. వచ్చే విద్యా సంవత్సరంలో (2024-25) ఆరు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశాలకు ఆలిండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (AISSEE 2024) షెడ్యూల్ ప్రకారం 2024, జనవరి 21న జరగాల్సి ఉన్నది. అయితే పరీక్ష తేదీని జనవరి 28కి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాయిదావేసింది. ఈనేపథ్యంలో దరఖాస్తుల గడువును కూడా పొడిగించింది.
గతంలో విడుదలచేసిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తు గడువు నేటితో (శనివారం) ముగిసింది. అయితే తాజాగా దానిని డిసెంబర్ 20 వరకు పొడిగించింది. పరీక్ష ఫీజును డిసెంబర్ 20 రాత్రి 11.50 గంటల వరకు చెల్లించవచ్చని తెలిపింది. అదేవిధంగా దరఖాస్తుల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే ఈ నెల 22 నుంచి 24 వరకు సవరించుకోవచ్చు.
వెబ్సైట్: https://exams.nta.ac.in/AISSEE/