MTech | హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని కొన్ని పీజీ ఇం జినీరింగ్ (ఎంఈ, ఎంటెక్) కోర్సులకు ప్రవేశ పరీక్షలేకుండా ప్రవేశాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నా యి. ఈ నేపథ్యంలో6 పోస్ట్ గ్రాడ్యుయే ట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్ టెస్ట్ (పీజీఈ సెట్)లో కొన్ని పరీక్షలు రద్దు కా నున్నాయి. వీటిలో టెక్స్టైల్ టెక్నాలజీ, ఎరోనాటికల్ ఇంజినీరింగ్, మెటలర్జీ వంటి కోర్సుల ప్రవేశ పరీక్షలు ఉన్నాయి. పరీక్షల్లేకుండా ప్రవేశాలు కల్పించే విధానంపై తెలంగాణ ఉన్నత విద్యామండలి ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీలో జేన్టీయూ వీసీ ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, ఓయూ రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ, పీజీఈసెట్ పూర్వ కన్వీనర్ రవీంద్రారెడ్డి ఉన్నారు. ఈ కమిటీ పలు సిఫారసులు చేయనుండగా, వాటిని ప్రభుత్వానికి సమర్పిస్తారు. ప్రభుత్వం ఆయా ప్రతిపాదనలకు ఆమోదిస్తే జీవో జారీ అవుతుంది. ఈ మేరకు 2024 -25 సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. పీజీఈసెట్ను మొత్తం 19 సబ్జెక్టులకు నిర్వహిస్తుండగా, పలు కోర్సుల్లో సీట్లు ఎక్కువుండటం ప్రవేశ పరీక్షకు హాజరయ్యేవారు తక్కువగా ఉండటంతోనే ఈ దిశగా అడుగులేస్తున్నారు.
బీపీఈడీ, యూజీ డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీఈసెట్ పరీక్షా విధానం మార్చే అవకాశం ఉన్నది. ప్రస్తుతం 2004లో ఇచ్చిన జీవో 168 ప్రకారం అభ్యర్థులకు శారీరక దారుఢ్య పరీక్షలను నిర్వహిస్తున్నారు. తాజాగా ఈవెంట్స్కు బదులుగా రాత పరీక్షను నిర్వహించే అంశంపై ఉన్నత విద్యామండలి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు అధ్యయనం చేసేందుకు కమిటీని నియమించారు. ఈ కమిటీలో పాలమూరు వర్సిటీ వీసీ ప్రొఫెసర్ లక్ష్మీకాంత్రాథోడ్, ప్రొఫెసర్ సత్యనారాయణ, ప్రొఫెసర్ సత్యనారాయణ, ప్రొఫెసర్ రాజేశ్లు సభ్యులుగా ఉన్నారు.