న్యూఢిల్లీ: రాంచీలోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 2021 విద్యాసంవత్సరానికిగాను వివిధ విభాగాల్లోని పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నది. దీనికోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేనెల 10 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ కోర్సులను బిట్స్ మెస్రా (మెయిన్ క్యాంపస్), జైపూర్, డియోఘర్, నోయిడా, పట్నా క్యాంపస్లు అందిస్తున్నాయి.
కోర్సు పేరు: పీహెచ్డీ (ఫుల్టైమ్/పార్ట్టైమ్)
విభాగాలు: ఆర్కిటెక్చర్, బయో ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ , ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మేనేజ్మెంట్, గణితం, మెకానికల్ ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫిజిక్స్, ప్రొడక్షన్ ఇంజినీరింగ్, రిమోట్ సెన్సింగ్, స్పేస్ ఇంజినీరింగ్ అండ్ రాకెట్ట్రీ తదితర కోర్సులు ఉన్నాయి.
అర్హత: సంబంధిత సబ్జక్టుల్లో 60 శాతం మార్కులతో ఎంఈ, ఎంటెక్, ఎమ్మెస్సీ (ఇంజినీరింగ్), ఎంఆర్క్, ఎంఫార్మసీ, ఎంప్లానింగ్ ,ఎమ్మెస్సీ, ఎంసీఏ, ఎంబీఏ లేదా తత్సమాన డిగ్రీలలో ఏదో ఒకటి ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ రాతపరీక్ష, అకడమిక్ కెరీర్, ఇంటర్వ్యూ ద్వారా
అప్లికేషన్ ఫీజు: రూ.2,500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ .1,500
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 10
ఎంట్రెన్స్ టెస్ట్: జూన్ 17 (ఆన్లైన్లో)
ఇంటర్వ్యూ తేదీ: జూన్ 18
వెబ్సైట్: www.bitmesra.ac.in