ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలోని ప్రొఫెసర్ జీ రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఎంబీఏ, ఎంసీఏ ప్రోగ్రామ్లలో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
కోర్సులు: ఎంబీఏ, ఎంసీఏ
కోర్సు కాలవ్యవధి: ఎంబీఏ (రెండేండ్లు), ఎంసీఏ (రెండేండ్లు)
నోట్: ఈ కోర్సులను గరిష్ఠంగా నాలుగేండ్లలో పూర్తిచేయాల్సి ఉంటుంది.
మీడియం: ఇంగ్లిష్ మీడియం
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంసీఏ కోర్సుకు ఇంటర్/ డిగ్రీ స్థాయిలో మ్యాథ్స్ ఒక సబ్జెక్ట్గా చదివి ఉండాలి.
ఎంపిక: ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా
ఎంట్రన్స్ టెస్ట్ తేదీ: డిసెంబర్ 10
నోట్: టీఎస్ ఐసెట్-2021 అర్హత పొందినవారు నేరుగా ప్రవేశాలు పొందవచ్చు.
కోర్సు ఫీజులు: ఎంబీఏ ప్రోగ్రామ్లో సెమిస్టర్కు రూ.10,000. ఎంసీఏ ప్రోగ్రామ్లో సెమిస్టర్కు రూ.7,500/-
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: నవంబర్ 27
రూ.500 ఆలస్య రుసుంతో డిసెంబర్ 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్సైట్: http://www.oucde.net