హైదరాబాద్: రాష్ట్రంలోని 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు https://www. tspsc.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో 27 సబ్జెక్టుల్లో.. మల్టీజోన్-1లో 724, మల్టీ జోన్-2లో 668 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటికి సంబంధించి ఈ నెల 9న నోటిఫికేషన్ను టీఎస్పీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే. వచ్చే సంవత్సరం జూన్ లేదా జూలైలో పరీక్ష నిర్వహించనున్నది.
డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తులు షురూ
రాష్ట్రంలోని 18 డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల భర్తీకి శుక్రవారం నుంచి జనవరి 5 వరకు https://www.tspsc.gov.in ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు.