దేశంలో ఉన్న ఐఐఎంలతో పాటు ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ (ఢిల్లీ యూనివర్సిటీ), ముంబైలోని ఎన్ఐటీఐఈ తదితర అత్యుత్తమ మేనేజ్మెంట్ విద్యాలయాలు కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) ఆధారంగా సీట్లను భర్తీ చేస్తాయి. ఆయా కళాశాలల్లో ఎంబీఏ చేయడం వల్ల పెద్ద సంస్థల్లో నిర్వహణ రంగంలో రాణించే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. క్లిష్టంగా ఉండే ఈ పరీక్షను సరైన ప్రణాళికతో చదవడం ద్వారా మంచి స్కోర్ సాధించవచ్చు. క్యాట్ను నవంబర్ 28న నిర్వహించనున్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి లెక్కిస్తే సుమారు 100 రోజులు పరీక్షకు సమయం ఉంది. పక్కా ప్రణాళిక ప్రకారం సన్నద్ధం కావాలి.