న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎన్బీసీసీ లిమిటెడ్ ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేనెల 21 వరకు అందుబాటులో ఉంటాయని తెలిసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజ్మెంట్ ట్రైనీ, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్టులను భర్తీ చేయనుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తుంది.
మొత్తం పోస్టులు: 7
ఇందులో మేనేజ్మెంట్ ట్రైనీ 5, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ 2 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: మేనేజ్మెంట్ పోస్టులకు ఎంబీఏ, ఎమ్మెస్డబ్ల్యూ, హెచ్ఆర్ఎంలో పీజీ చేసి ఉండాలి. ట్రాన్స్లేటర్ పోస్టుకు హిందీ సబ్జెక్టులో పీజీ చేయాలి. ఇంగ్లిష్ నుంచి హిందీలోకి ట్రాన్స్లేషన్లో ఏడాది అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు: రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 21
వెబ్సైట్: www.nbccindia.com