హైదరాబాద్: ఎమ్మెస్సీ నర్సింగ్ (MSC Nursing), ఎంపీటీ (MPT) కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి మాప్ అప్ విడత వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. శనివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. అయితే తుది మెరిట్ జాబితాలోని అభ్యర్థులు మాత్రమే కళాశాలలవారీగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ తెలిపింది. ఈ మేరకు గత విడత తర్వాత మిగిలిపోయిన సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సీట్ల ఖాళీల వివరాలను వెబ్సైట్లో పొందుపరిచింది.