వరంగల్ : ప్రైవేట్ డెంటల్ కాలేజీల్లో యాజమాన్య కోటా కింద బీడీఎస్ ప్రవేశాలకు మాప్ అప్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ను కాళోజీ వైద్య, ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. ఈ నెల 19, 20 తేదీల్లో వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. రెండో విడత అనంతరం ఖాళీగా ఉన్న సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. కళాశాల వారిగా సీట్ల ఖాళీల వివరాలను వెబ్సైట్లో పొందుపరిచారు.
ఈ నెల 19 వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 20వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు కాలోజీ వైద్య, ఆరోగ్య విశ్వవిద్యాలయం వెబ్సైట్ www.knruhs.telangana.gov.in లో సంప్రదించాలని యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.