న్యూఢిల్లీ: కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వశాఖ యంగ్ ప్రొఫెషన్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఆన్లైన్ అప్లికేషన్లు ఈ నెల 22 వరకు అందుబాటులో ఉంటాయి. ఆసక్తికలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా 130 పోస్టులను భర్తీ చేయనుంది. డిగ్రీ పూర్తిచేసినవారు అప్లయ్ చేసుకోవచ్చు. అభ్యర్థులను రాతపరీక్ష ద్వారా ఎంపిక చేయనుంది. వీరిని రెండేండ్ల కాలపరిమితికి కాంట్రాక్టు ప్రాతిపదికన నియమిస్తారు. దానిని మరో మూడేండ్ల వరకు పొడించే అవకాశం ఉంటుంది.
మొత్తం పోస్టులు: 130
అర్హతలు: బీఏ, బీఈ, బీటెక్, బీఈడీలో ఏదో ఒకటి చేని నాలుగేండ్ల అనుభవం ఉండాలి. లేదా ఎంబీఏ, పీజీలో ఎకనామిక్స్, సైకాలజీ, సోషియాలజీలో ఏదైనా చేసి రెండేండ్లపాటు పనిచేసిన అనువభవం తప్పనిసరి. అభ్యర్థులు 20 నుంచి 40 ఏండ్ల మధ్య వయస్కులై ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 22
వెబ్సైట్: www.ncs.gov.in