హైదరాబాద్: లాసెట్ 2023 (LAW CET) తుది విడుత కౌన్సెలింగ్ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 13వ తేదీవరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 14 నుంచి 16వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదుచేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. డిసెంబర్ 19న సీట్లను కేటాయిస్తారు. 20 నుంచి 23వ తేదీవరకు విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఈమేరకు ఉన్నత విద్యామండలి షెడ్యూల్ విడుదల చేసింది.
కాగా, మూడేండ్లు, ఐదేండ్ల ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో కన్వీనర్ కోటాలో మొత్తం 6,894 సీట్లు ఉండగా.. 5,912 మందికి తొలి విడత సీట్లు కేటాయించారు. వీరిలో 65 శాతం మంది మాత్రమే కాలేజీల్లో చేరారు. దీంతో తుదివిడుత కౌన్సెలింగ్లో 40 శాతం సీట్లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.