హైదరాబాద్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) హైదరాబాద్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి కరాటే కోర్సును ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే 400పైగా విద్యార్థులకు కరాటే, మార్షల్ ఆర్ట్స్, యోగా, ధ్యానంపై శిక్షణనిస్తున్నారు. 14 గంటలు క్లాసులకు హాజరై ప్రాక్టీస్ పూర్తిచేసిన వారికి 1 క్రెడిట్ ఇస్తామని ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు. ఈ క్రెడిట్ను అకడమిక్ పరంగా వినియోగించుకోవచ్చని సూచించారు. ఇప్పటికే ఐఐటీ మద్రాస్లో హప్కిడో (మార్షల్స్ ఆర్ట్స్)ను నేర్పిస్తున్నారు. ఐఐటీ బాంబేలో మార్షల్ ఆర్ట్స్లో శిక్షణనిస్తున్నారు. కానీ, కోర్సులుగా నిర్వహించడం లేదు. ఇది అమలైతే ఓ అత్యున్నత విద్యాసంస్థలో కరాటేను కోర్సుగా ప్రవేశపెట్టిన విశ్వవిద్యాలయంగా ఐఐటీ హైదరాబాద్ నిలువనున్నది.