న్యూఢిల్లీ : జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2021-22 విద్యాసంవత్సరాకి గాను ఆరో తరగతి ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష తేదీ ఖరారైంది. ఆగస్టు 11న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ప్రవేశ పరీక్ష నిర్వహణకు 11,182 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. 2021-22 విద్యాసంవత్సరంలో 47,320 సీట్లకుగాను 24,17,009 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరీక్ష నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జేఎన్వీ ప్రవేశ పరీక్షను హిందీ, ఇంగ్లిష్ ఆయా రాష్ట్రాల ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తారు. పరీక్షకు రెండు గంటల సమయం ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ, అర్థమ్యాటిక్, ల్యాంగ్వేజ్ విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. 80 బహులైశ్చిక ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. ప్రవేశ పరీక్షలో మెరిట్ ఆధారంగా విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు.