న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద చమురు ఉత్పత్తి, పంపిణీదారు అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) ట్రేడ్, టెక్నీషియన్ విభాగాల్లో అప్రెంటిస్షిప్ అందిస్తున్నది. ఆసక్తికలిగినవారు ఈ నెల 12 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 265 పోస్టులను భర్తీ చేస్తున్నది. వీటిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఖాళీలు ఉన్నాయి. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నది.
మొత్తం ఖాళీలు: 265
అర్హతలు: ఇంటర్ లేదా డిప్లొమా, సంబంధిత ట్రేడ్లో డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థులు 18 నుంచి 24 ఏండ్ల లోపు ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా
అప్లికేషన్ విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.100, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజూ లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 12
వెబ్సైట్: www.iocl.com