న్యూఢిల్లీ: ఇండియా పోస్ట్ (India Post) భారీ మొత్తంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న గ్రామీణ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్మాస్టర్ నియామకాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 5 వరకు అందుబాటులో ఉంటాయి. పదో తరగతి పాసై స్థానిక భాష తెలిసినవారు అర్హులు. మొత్తం 38,926 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఎలాంటి రాతపరీక్ష, ఇంటర్వ్యూలు లేకుండా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నది.
మొత్తం ఖాళీలు: 3926
ఇందులో తెలంగాణలో 1226 (జనరల్ 509, ఓబీసీ 266, ఈడబ్ల్యూఎస్ 123, ఎస్సీ 200, ఎస్టీ 88, పీడబ్ల్యూడీ 40), ఆంధ్రప్రదేశ్లో 1716 పోస్టులు (జనరల్ 755, ఓబీసీ 333, ఈడబ్ల్యూఎస్ 224, ఎస్సీ 220, ఎస్టీ 123, పీడబ్ల్యూడీ 61) ఉన్నాయి.
అర్హతలు: ఇంగ్లిష్, మ్యాథ్స్ సబ్జెక్టులతో పదో తరగతి పాసై, 18 నుంచి 40 ఏండ్లలోపువారై ఉండాలి. స్థానిక భాషలో చదవడం, రాయడం, సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: పదోతరగతిలో మార్కుల ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.100
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 5
వెబ్సైట్: https://indiapostgdsonline.gov.in