హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేరవుతున్న బీసీ అభ్యర్థులకు బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు ఆ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఉచిత కోచింగ్ పొందాలనుకునే అభ్యర్థుల కోసం రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మంత్రి బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కమలాకర్ మాట్లాడుతూ.. నేటి నుంచి ఈ నెల 16వ తేదీ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అదే రోజు ఆన్లైన్లో ఎంపిక పరీక్ష నిర్వహించి తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. 21 నుంచి కోచింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. మొత్తం 16 స్టడీ సర్కిళ్లలో 25 మందికి చొప్పున ఆఫ్లైన్ క్లాసులు నిర్వహిస్తామన్నారు. మరో 50 వేల మందికి ఆన్లైన్ ద్వారా తరగతులు నిర్వహిస్తామని మంత్రి పేర్కొన్నారు.
వార్షిక ఆదాయం రూ. 5 లక్షల లోపు ఉన్న అభ్యర్థులకు ఉచిత కోచింగ్ అందిస్తామన్నారు. గ్రూప్ -1, గ్రూప్-2 కోచింగ్కు ఎంపికయ్యే 10 వేల మంది అభ్యర్థులకు స్టైఫండ్ ఇస్తామని ప్రకటించారు. గ్రూప్-1 అభ్యర్థులకు ఆరు నెలల పాటు రూ. 5 వేల చొప్పున, గ్రూప్-2 అభ్యర్థులకు 3 నెలల పాటు నెలకు రూ. 2 వేల చొప్పున స్టైఫండ్ ఇస్తామన్నారు.
పేద, వెనుకబడిన వర్గాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
👉 పరీక్షలో ఎలాంటి టాంపరింగ్ కు ఆస్కారం లేకుండా పటిష్ట టెక్నాలజీ. వచ్చిన మార్కుల ఆధారంగా శిక్షణకు ఎంపిక
👉అభ్యర్థులు https://t.co/CfojKA5l0Dhttps://t.co/sYaZC5cqq0 లలో రిజిస్టర్ చేసుకోండి pic.twitter.com/yuM20ta71Y
— Gangula Kamalakar (@GKamalakarTRS) April 6, 2022