హైదరాబాద్: నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పీఎంకేవీవై ప్రోగ్రామ్ ద్వారా హైదరాబాద్లోని సొసైటీ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో రాష్ట్ర పరిధిలోని యువతకు మొబైల్ హార్డ్వేర్ ఇంజినీర్ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. దీనికిగాను పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్ పాసైన వారు అర్హులన్నారు. వీరికి నాలుగు నెలల పాటు శిక్షణనిచ్చి 100శాతం ఉద్యోగం కల్పిస్తామని సంస్థ ప్రతినిధి క్రాంతి వెలగపూడి తెలిపారు. 18 నుంచి 30 ఏండ్ల వయసున్న వారు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆధార్కార్డు, కులధ్రువీకరణ పత్రం, క్వా లిఫికేషన్ సర్టిఫికెట్లు, ఐదుపాస్పోర్ట్ సైజ్ ఫొటోలతో దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు. వివరాలకు 9495454999 లేదా 99 49071079లలో సంప్రదించవచ్చన్నారు.