జాతీయం
పీ15బీ నౌక
రక్షణ శాఖ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్15బీ (పీ15బీ) పేరుతో నిర్మించిన తొలి నౌక ఇండియన్ నేవీలో అక్టోబర్ 31న చేరింది. పీ15బీ పేరుతో నాలు గు నౌకలను మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ (ముంబై) నిర్మించనున్నది. 160 మీటర్ల పొడవు ఉన్న ఈ నౌక 30 నాటికళ్ల వేగంతో ప్రయాణిస్తుంది.
కొత్త పార్టీ
పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ తన కొత్త పార్టీ పేరు ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’ అని నవంబర్ 2న ప్రకటించారు. 2002లో పంజాబ్కు కాంగ్రెస్ తరఫున సీఎంగా మొదటిసారిగా ఎన్నికయ్యారు. 2017లో రెండోసారి సీఎం అయిన అమరీందర్ను మార్చాలంటూ 50కి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోనియాగాంధీకి ఫిర్యాదు చేశారు. దీంతో సెప్టెంబర్ 18న సీఎం పదవికి రాజీనామా చేశారు. నవంబర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టారు. పంజాబ్ అసెంబ్లీలో 117 స్థానాలు ఉన్నాయి.
యాన్ ఇన్కంప్లీట్ లైఫ్
‘యాన్ ఇన్కంప్లీట్ లైఫ్’ పేరుతో పైలట్ విజయ్పత్ సింఘానియా రచించిన పుస్తకం నవంబర్ 2న విడుదలైంది. పాన్ మాక్ మిలన్ సంస్థ ప్రచురించిన ఈ పుస్తకంలో తన జీవితంలో చోటుకున్న సంఘటనలను రాశారు. ఆయన 1988లో మైక్రోలైట్ విమానంలో ఒంటరిగా బ్రిటన్ నుంచి భారత్కు 23 రోజుల్లో ప్రయాణించి రికార్డు సృష్టించారు. అదే ఏడాదిలో హాట్ బెలూన్ (వేడి గాలి నింపిన)లో సముద్ర మట్టానికి 69,852 అడుగుల ఎత్తులో ప్రయాణించి, ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు.
విజిల్ బ్లోయర్
కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ పరిధిలోని ఇండియన్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఐఆర్ఈడీఏ) విజిల్ బ్లోయర్ వెబ్ పోర్టల్ను నవంబర్ 2న ఐఆర్ఈడీఏ చైర్మన్, ఎండీ ప్రదీప్ కుమార్ దాస్ ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా మోసం, అవినీతి, అధికార దుర్వినియోగం వంటి వాటిపై సమాచారం ఇవ్వవచ్చు.
ఆదిశంకరాచార్య విగ్రహావిష్కరణ
ఉత్తరాఖండ్ రాష్ట్రం, రుద్రప్రయాగ్ జిల్లాలోని కేదార్నాథ్లో ఆదిశంకరాచార్యుడి విగ్రహాన్ని ప్రధాని మోదీ నవంబర్ 5న ఆవిష్కరించారు. 12 అడుగుల ఎత్తులో, రూ.130 కోట్లతో ఈ విగ్రహాన్ని నిర్మించారు. 2013లో వరదల వల్ల ధ్వంసమైన ఈ విగ్రహాన్ని పునర్నిర్మించారు.
అంతర్జాతీయం
జీ-20 సమావేశం
జీ-20 దేశాల 16వ శిఖరాగ్ర రెండు రోజుల సమావేశం ఇటలీ రాజధాని రోమ్లో అక్టోబర్ 31న ముగిసింది. ఈ సమావేశానికి ఇటలీ ప్రధానమంత్రి మారియో డ్రాఘీ అధ్యక్ష వహించారు. ఆరోగ్య, ఆర్థిక రంగాలు, వాతావరణ మార్పులపై చర్చించి ‘రోమ్ డిక్లరేషన్’ను జారీచేశారు.
ఐరిస్
వాతావరణ మార్పులను తట్టుకునేలా చిన్న చిన్న ద్వీపసమూహాల్లాంటి దేశాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రెసిలియంట్ ఐలాండ్ స్టేట్స్ (ఐరిస్) అనే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ నవంబర్ 2న ప్రారంభించారు. ప్రపంచ దేశాలు తీసుకువచ్చిన కొయిలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (సీడీఆర్ఐ)లో భాగంగానే ఐరిస్ పనిచేస్తుందని కాప్-26 సదస్సులో మోదీ వెల్లడించారు.
బ్లూ ఫ్లాగ్
ఇజ్రాయెల్లోని వోవ్డా ఎయిర్బేస్లో అంతర్జాతీయ వైమానిక దళ వ్యాయామం బ్లూ ఫ్లాగ్ అక్టోబర్ 17 నుంచి 28 వరకు నిర్వహించారని భారత వైమానిక దళ అధికారులు నవంబర్ 2న ప్రకటించారు. భారత్, ఇజ్రాయెల్, జర్మనీ, ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్, గ్రీస్, యూఎస్ దీనిలో పాల్గొన్నాయి. వీటిని 2013 నుంచి ఇజ్రాయెల్ నిర్వహిస్తుంది. భారత్ నుంచి మిరేజ్ 200 ఎయిర్ క్రాఫ్ట్ విభాగం ఇందులో పాల్గొంది. ఈ విన్యాసాల్లో పాల్గొనడం భారత్, ఫ్రాన్స్, జర్మనీలకు ఇదే తొలిసారి. ఈ బ్లూ ఫ్లాగ్ థీమ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ ఇన్ కాంప్లెక్స్ ఆపరేషనల్ సినరియోస్ (సంక్లిష్ట కార్యాచరణ దృశ్యాల్లో నాలుగో, ఐదో తరం విమానాల ఏకీకరణ).
కొవాగ్జిన్కు అనుమతి
కరోనా నివారణ వ్యాక్సిన్ కొవాగ్జిన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) నవంబర్ 3న అనుమతి ఇచ్చింది. ఈ వ్యాక్సిన్ను ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ (ఈయూఎల్)లో చేర్చింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారత కొవిడ్ టీకా ఇదే. ఇప్పటివరకు ఫైజర్, కొవిషీల్డ్, ఆస్ట్రాజెనికా, జాన్సన్ అండ్ జాన్సన్, మోడెర్నా వ్యాక్సిన్లను అత్యవసర పరిస్థితుల్లో వినియోగించవచ్చని డబ్ల్యూహెచ్వో తెలిపింది. దీంతో భారతీయులకు విదేశీ ప్రయాణాలు సులభం కానున్నాయి.
గాంధీ నాణెం
మహాత్మాగాంధీ జీవితం, ఆశయాలను ప్రతిబింబిస్తూ రూపొందించిన 5 పౌండ్ల స్మారక నాణేన్ని బ్రిటన్ ప్రభుత్వం నవంబర్ 4న ఆవిష్కరించింది. భారత జాతీయ పువ్వు కమలంతో పాటు గాంధీ సూక్తుల్లో ఒకటైన్ ‘మై లైఫ్ ఈజ్ మై మెసేజ్’ను ఈ నాణెంపై పొందుపరిచారు. ఈ నాణేనికి హీనా గ్లోవర్ డిజైన్ చేశారు. ఈ నాణెం బ్రిటన్-భారత్ మధ్య శాశ్వత సంబంధాలు, సాంస్కృతికి వారధికి ప్రతీకగా నిలుస్తుందని బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషి సునక్ అన్నారు.
క్రీడలు
క్రీడా పురస్కారాలు
2021కు గాను జాతీయ క్రీడా పురస్కారాలు ధ్యాన్చంద్ ఖేల్త్న్ర, అర్జున, ద్రోణాచార్య అవార్డులకు ఎంపికైనవారిని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నవంబర్ 3న ప్రకటించింది.
మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న
నీరజ్ చోప్రా (అథ్లెటిక్స్), మిథాలీ రాజ్ (క్రికెట్), సునీల్ ఛెత్రి (ఫుట్బాల్), రవికుమార్ దహియా (రెజ్లింగ్), పీఆర్ శ్రీజేశ్ (హాకీ), లవ్లీనా బోర్గోహెయిన్ (బాక్సింగ్), ప్రమోద్ భగత్ (బ్యాడ్మింటన్), సుమిత్ అంటిల్ (జావెలిన్ త్రో), అవని లేఖరా (షూటింగ్), కృష్ణ నాగర్ (బ్యాడ్మింటన్), మనీశ్ నర్వాల్ (బ్యాడ్మింటన్), మన్ప్రీత్ సింగ్ (హాకీ).
ద్రోణాచార్య అవార్డు
రాధాకృష్ణ (అథ్లెటిక్స్), సంధ్య (బాక్సింగ్), ప్రీతమ్ (హాకీ), జైప్రకాశ్ (పారా షూటింగ్), రామన్ (రెజ్లింగ్).
అర్జున అవార్డు
అర్పిందర్ (అథ్లెటిక్స్), సిమ్రన్జీత్ కౌర్ (బాక్సింగ్), శిఖర్ ధావన్ (క్రికెట్), భవాని (ఫెన్సింగ్), మౌనిక (హాకీ), వందన (హాకీ), సందీప్ నర్వాల్ (కబడ్డీ), హిమాని పరబ్ (మల్లకంబ్), అభిషేక్వర్మ (షూటింగ్), అంకిత రైనా (టెన్నిస్), దీపక్ పునియా (రెజ్లింగ్), దిల్ప్రీత్ (హాకీ), హర్మన్ప్రీత్ (హాకీ), రూపీందర్ (హాకీ), సురేందర్ (హాకీ), అమిత్ (హాకీ), బీరేంద్ర (హాకీ), సుమిత్ (హాకీ), నీలకంఠ శర్మ (హాకీ), హార్దిక్ సింగ్ (హాకీ), వివేక్ సాగర్ (హాకీ), గుర్జాంత్ (హాకీ), మన్దీప్ (హాకీ), షంషేర్ (హాకీ), లలిత్ కుమార్ (హాకీ), వరుణ్ కుమార్ (హాకీ), సిమ్రత్జీత్ సింగ్ (హాకీ), యోగేశ్ (పారా అథ్లెటిక్స్), నిషధ్ కుమార్ (పారా అథ్లెటిక్స్), ప్రవీణ్ కుమార్ (పారా అథ్లెటిక్స్), భవీనా పటేల్ (పారా టేబుల్ టెన్నిస్), హర్విందర్ సింగ్ (పారా ఆర్చరీ), శరద్ కుమార్ (పారా అథ్లెటిక్స్), సుహాస్ (పారా బ్యాడ్మింటన్), సింగ్రాజ్ (పారా షూటింగ్).
ద్రోణాచార్య లైఫ్టైమ్ అచీవ్మెంట్
టీపీ ఉసెప్ (అథ్లెటిక్స్), సర్కార్ తల్వార్ (క్రికెట్), సర్పాల్సింగ్ (హాకీ), అషాన్ కుమార్ (కబడ్డీ), తపన్ కుమార్ (స్విమ్మింగ్)
ధ్యాన్చంద్ లైఫ్టైమ్ అచీవ్మెంట్
లేఖ (బాక్పింగ్), అభిజిత్ కుంతే (చెస్), దేవేందర్ (హాకీ), వికాస్ (కబడ్డీ), సజ్జన్ సింగ్ (రెజ్లింగ్).
రాహుల్ ద్రవిడ్
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ నవంబర్ 3న ఎంపికయ్యాడు. ప్రస్తుతం హెడ్ కోచ్గా రవిశాస్త్రి వ్యవహరిస్తున్నాడు. నవంబర్ 17 నుంచి భారత్లో న్యూజిలాండ్తో జరుగనున్న టీ20 సిరీస్ నుంచి ద్రవిడ్ కోచ్ హోదాలో కొనసాగనున్నాడు. ద్రవిడ్ శిక్షణలో భారత అండర్-19 జట్టు రెండుసార్లు ప్రపంచకప్లో ఫైనల్స్కు చేరి రన్నరప్గా నిలిచింది.
డ్వేన్ బ్రావో
ఇంటర్నేషనల్ క్రికెట్కు వెస్టిండీస్ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో నవంబర్ 5న రిటైర్మెంట్ ప్రకటించాడు. 2004లో క్రికెట్లో అరంగేట్రం చేసిన బ్రావో 40 టెస్టులు ఆడి 2200 రన్స్ చేశాడు. 86 వికెట్లు తీశాడు. 164 వన్డేల్లో 2968 రన్స్ చేసి, 199 వికెట్లు పడగొట్టాడు. 90 టీ20ల్లో 1245 పరుగులు చేసి, 78 వికెట్లు తీశాడు.
వార్తల్లో వ్యక్తులు
గ్యారీ ఫ్రీడ్మన్
కుక్ జలసంధిని తొలిసారి ఎలక్ట్రిక్ విమానంలో నవంబర్ 1న దాటిన గ్యారీ ఫ్రీడ్మన్ రికార్డు సృష్టించాడు. న్యూజిలాండ్లోని ఉత్తర, దక్షిణ దీవులను ఈ కుక్ జలసంధి కలుపుతుంది. బ్లెన్హీమ్ నుంచి ఒంటరిగా బయలుదేరిన ఆయన 40 నిమిషాల్లో వెల్లింగ్టన్ చేరుకున్నారు.
అరుణ్ చావ్లా
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కి)కి కొత్త డైరెక్టర్ జనరల్గా అరుణ్ చావ్లా నవంబర్ 2న ప్రమాణం చేశారు. ఫిక్కీని 2011లో ఢిల్లీలో స్థాపించారు. ప్రెసిడెంట్గా ఉదయ్ శంకర్, సెక్రటరీ జనరల్గా దిలిప్ చెనాయ్ వ్యవహరిస్తున్నారు.
వినీశ
కాప్ (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్)-26 సదస్సులో భారత్కు చెందిన 14 ఏండ్ల బాలిక వినీశా ఉమాశంకర్ నవంబర్ 3న ప్రసంగం చేసింది. వాతావరణ మార్పులపై యూకేలో భాగమైన స్కాట్లాండ్లోని గ్లాస్గోలో కాప్-26 సదస్సు అక్టోబర్ 31 నుంచి నవంబర్ 12 వరకు నిర్వహిస్తున్నారు.
వేముల సైదులు
జీకే, కరెంట్ అఫైర్స్ నిపుణులు
ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్ హైదరాబాద్