హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల దరఖాస్తుల గడువును ఈ నెల 19 వరకు పొడిగించినట్టు టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ కమిషనర్ రొనాల్డ్రోస్ సోమవారం తెలిపారు. బీఎస్సీ, బీఏ, బీకాం, బీబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు బాలబాలికలు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు www.tswreis.ac.in చూడాలని కోరారు.
బెస్ట్ ఉర్దూ టీచర్ అవార్డుకు దరఖాస్తులు
ఉత్తమ సేవలందించిన ఉర్దూ టీచర్లకు బెస్ట్ టీచర్ అవార్డులు ఇవ్వనున్నట్టు ఉర్దూ అకాడమీ డైరెక్టర్ మహ్మద్గౌస్ తెలిపారు. 2020 –21 విద్యాసంవత్సరానికిగాను ఈ అవార్డుకు ఈ నెల 15వ తేదీలోపు www.urduacademyts.com ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.