హైదరాబాద్: రక్షణ శాఖ పరిధిలోని డీఆర్డీఓలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకికి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్లైన్ అప్లికేషన్లు వచ్చే నెల 5 వరకు అందుబాటులో ఉంటాయి. ఎలాంటి రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైనవారు జోధ్పూర్లోని డిఫెన్స్ ల్యాబొరేటరీలో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 47
ఇందులో ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 2, డీజిల్ మెకానిక్ 2, కార్పెంటర్ 2, ఐసీటీఎస్ఎం 2, కోపా 20, స్టెనోగ్రాఫర్-సెక్రటేరియల్ అసిస్టెంట్ (హిందీ, ఇంగ్లిష్) 10, కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్క్ మెయింటేనెన్స్ 3, ప్లంబర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, ఫిట్టర్, ఎలక్ట్రిషన్ పోస్టులు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 2018-2020 మధ్య పాసైనవారు మాత్రే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అంతకు ముందు పాసైనవారు అప్లయ్ చేయకూడదు.
ట్రైనింగ్: ఏడాది
స్టయిఫండ్: ప్రతినెల రూ.7000
ఎంపిక ప్రక్రియ: అకడమిక్ మెరిట్ ఆధారంగా
అప్లికేషన్ విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 5
వెబ్సైట్: https://apprenticeshipindia/org/course-search