ఉస్మానియా యూనివర్సిటీ, మే 17: ఓయూ పరిధిలో వాయిదా పడిన డిగ్రీ పరీక్ష తేదీలను ఖరారు చేసినట్టు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ శ్రీనగేశ్ మంగళవారం తెలిపారు.
బీఏ, బీఎస్డబ్ల్యూ (ఇయర్వైజ్ స్కీమ్) కోర్సుల బ్యాక్లాగ్ పరీక్షలను ఈ నెల 25 నుంచి, ఓయూ దూర విద్యా కేంద్రమైన ప్రొఫెసర్ జీ రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అందించే బీఏ, బీకామ్, బీబీఏ కోర్సుల రెగ్యులర్, బ్యాక్లాగ్ డిగ్రీ కోర్సుల పరీక్షలను ఈ నెల 26 నుంచి నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. వివరాలకు www.osmania.ac.in చూడాలని సూచించారు.