1. పీవీ నరసింహారావు స్మారక పురస్కారాన్ని మార్చి 15న ఎవరికి ప్రదానం చేశారు?
1) నందన్ నీలెకనీ
2) ఆనంద్ మహీంద్రా
3) రతన్ టాటా
4) పై అందరికీ జవాబు: 3
2. టీకాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడానికి జాతీయ టీకా దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏ రోజున నిర్వహిస్తారు?
1) మార్చి 16 2) మార్చి 15
3) మార్చి 1 4) మార్చి 20
జవాబు: 1
3. ఇటీవల వార్తల్లోకి వచ్చిన వివాదాస్పద ‘భోజ్శాల కాంప్లెక్స్’ ఏ రాష్ట్రంలో ఉంది?
1) ఉత్తరప్రదేశ్ 2) మధ్యప్రదేశ్
3) మహారాష్ట్ర 4) ఛత్తీస్గఢ్
జవాబు: 2
4. ఈట్ రైట్ క్యాంపస్లు అనేవి దేనికి సంబంధించినవి?
1) ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తన ఈట్ రైట్ ఇండియా కార్యక్రమంలో భాగం
2) 100 జైళ్లను ఈట్ రైట్ క్యాంపస్లుగా ధృవీకరించనున్నారు
3) సురక్షితమైన, ఆరోగ్యకరమైన ఆహార నాణ్యతలను నిర్దారించడం
4) పైవన్నీ జవాబు: 4
5. దేశం మొత్తంలో చిరుధాన్యాల ఉత్పత్తికి సంబంధించి కింది వాటిలో సరైన అంశాలు ఏవి?
1) రాజస్థాన్లో రైతులకు చిరుధాన్యాలు, ముతక ధాన్యాల విత్తనాలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు
2) దేశంలో చిరుధాన్యాల ఉత్పత్తిలో రాజస్థాన్ వాటా 26 శాతం
3) బజ్రా ఉత్పత్తిలో రాజస్థాన్ వాటా 41 శాతం
4) పైవన్నీ
జవాబు: 4
సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ, హైదరాబాద్ సౌజన్యంతో…