న్యూఢిల్లీ: జేఈఈ మెయిన్ మూడో విడత పరీక్షకు సర్వం సిద్ధమయ్యింది. కరోనా కారణంగా వాయిదా పడిన జేఈఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ పరీక్షను జూలై 20, 22, 25, 27 తేదీల్లో నిర్వహించనున్నారు. పరీక్ష కోసం దేశవ్యాప్తంగా 7,09,519 మంది దరఖాస్తు చేసుకున్నారు. దీనిని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తున్నది. మూడో విడత పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు ఎన్టీఏ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.
ఏప్రిల్ నెలలో జరగాల్సిన మూడో విడత, మే నెలలో జరగాల్సిన నాలుగో విడత పరీలు కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసింది. అయితే దేశంలో కేసులు తక్కువ కావడంతో ఈ పరీక్షలను నిర్వహించడానికి ఎన్టీఏ సిద్ధమయ్యింది. ఈ నేపథ్యంలో జేఈఈ మెయిన్ మూడో సెషన్ను రేపటి నుంచి నాలుగు రోజులపాటు నిర్వహించనున్నది. విద్యార్థుల సౌకర్యం కోసం పరీక్ష కేంద్రాలను కూడా అధికం చేశారు.
వెబ్సైట్: jeemain.nta.nic.in